తిరుమల కాటేజీల పేర్లు మార్పు

Read Time:  1 min
tirumala eo
tirumala eo
FONT SIZE
GET APP

టీటీడీ బోర్డు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న కాటేజీలకు 150 పేర్లు పెట్టనున్నామని టీటీడీ ఈవో జే. శ్యామలరావు తెలిపారు. కాటేజీ దాతలు ఎంపిక చేసుకుని పేర్లను మార్చేలా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుందన్నారు. తిరుపతిలోని పరిపాలన భవనం మీటింగ్‌ హాల్‌లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుమలను మోడల్‌ టౌన్‌గా మార్చడమే తమ లక్ష్యమని , ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హిందూ ధార్మిక కేంద్రమైన తిరుమలను మోడల్ టౌన్‌గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా డిజైన్లు రూపొందించాలని అధికారులకు తెలిపారు. ఇందుకోసం విజన్ డాక్యుమెంట్ తక్షణావసరం అని, టీటీడీకి అర్బన్ డెవలప్‌మెంట్ అండ్ టౌన్ ప్లానింగ్ వింగ్‌ను ఏర్పాటు చేయనున్నామని చెప్పుకొచ్చారు.

అలాగే ఆలయంలో పాదచారులకు అనుకూలంగా ఫుట్‌పాత్‌లను మార్చడంతోపాటు ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు అవసరమైన నిర్మాణాలు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు కల్పించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. కొన్ని పాత కాటేజీలతో పాటు బాలాజీ ఆర్టీసీ బస్టాండ్‌ను కూడా కొత్తగా నిర్మాణం చేయాల్సి వస్తుందని పేర్కొన్నారు. రాబోయే 25 ఏళ్ల భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని డాక్యుమెంటును రూపొందించి మౌళిక సదుపాయాలు కల్పించాలనే ఆలోచన ఉందన్నారు.

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.