ఖార్ఘర్, నవీ ముంబైలో గత 12 ఏళ్లుగా నిర్మాణంలో ఉన్న ఇస్కాన్ ఆలయం చివరకు పూర్తయ్యింది. 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ ఆలయం, ఇప్పుడు ఆసియాలో రెండవ అతిపెద్ద ఇస్కాన్ దేవాలయంగా నిలిచింది. శ్రీకృష్ణ భగవానునికి అంకితమైన ఈ ఆలయాన్ని “శ్రీ శ్రీ రాధా మదన్ మోహన్ జీ” ఆలయం అనే పేరుతో నిలిపారు. ఆధ్యాత్మికత మరియు సాంస్కృతిక పరంగా ఇది ఓ గొప్ప కేంద్రమవుతోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జనవరి 15న ఈ విశిష్టమైన ఆలయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ ఆలయ ప్రత్యేకతలు, విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ మహోత్సవాలు జనవరి 9న ప్రారంభమయ్యాయి మరియు జనవరి 15 వరకు కొనసాగనున్నాయి. ఆలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని వారంపాటు ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు, హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నారు. ఆలయ ట్రస్టీ మరియు ప్రధాన వైద్యుడు సూరదాస్ ప్రభు తెలిపిన వివరాల ప్రకారం, ప్రధాన మంత్రి మోదీ ఆలయ ప్రారంభంతో పాటు సాంస్కృతిక కేంద్రం మరియు వేద మ్యూజియానికి శంకుస్థాపన చేయనున్నారు.నవీ ముంబైలోని ఖార్ఘర్ సెక్టార్ 23లో ఉన్న ఈ ఆలయం నిర్మాణానికి 12 సంవత్సరాల సమయం పట్టింది. తెలుపు మరియు గోధుమ రంగుల పాలరాయితో నిర్మించిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళను ప్రతిబింబిస్తుంది.
సుమారు రూ. 200 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయం సాంప్రదాయం మరియు ఆధునికత కలయికతో అలరారుతోంది. గతంలో, 2024 అక్టోబర్ 12న ప్రధానమంత్రి మోదీ ఈ ఆలయాన్ని సందర్శించారు, ఇది ఈ ఆలయ ప్రాధాన్యతను తెలియజేస్తుంది.ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణగా “ప్రభుపాద స్మారక” ఉంది, ఇది ఇస్కాన్ వ్యవస్థాపకులు శ్రీల ప్రభుపాదకి అంకితం చేయబడింది. ఆలయ అంతర్గతం శ్రీకృష్ణ భగవానుని జన్మ రహస్యం మరియు లీలలను 3డి చిత్రాలతో అద్భుతంగా అలంకరించబడింది. ఇది భక్తులకు ఓ ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.