📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అయోధ్య: బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో బుధవారం రాత్రి దీపావళి సంబరాలు కనులపండువగా జరిగాయి.

Author Icon By Divya Vani M
Updated: October 31, 2024 • 5:28 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గిన్నిస్‌ రికార్డుల సృష్టి – దీపావళి పర్వదినంలో అయోధ్యలో దీపోత్సవం అయోధ్య: పవిత్రమైన సరయూ నదీతీరంలో, బుధవారం రాత్రి బాలరాముడు కొలువుదీరిన అయోధ్యలో దీపావళి వేడుకలు అద్భుతంగా జరిగాయి. ఈ వేడుకలు ఘనంగా కాంతులు పంచుతూ, కోట్లాది దీపాల వెలుగులతో అయోధ్యను కాంతిమయం చేశాయి ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం గత ఎనిమిదేళ్లుగా దీపోత్సవం నిర్వహిస్తోంది. ఈసారి కూడా మరింత వైభవంగా, అంతకు మించి ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ బాలరాముణ్ని దర్శించుకొని, స్వయంగా మట్టి ప్రమిదల్లో దీపాలు వెలిగించారు. ఈ దీపాలు సరయూ నదీతీరాన్ని ప్రకాశవంతంగా మార్చాయి. మొత్తం 55 ఘాట్లలో 25 లక్షలకు పైగా భక్తులు ఒక్కసారిగా దీపాలు వెలిగించి, అయోధ్య నగరాన్ని నక్షత్రాలా మెరిపించారు.

యూపీ టూరిజం విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ దీపోత్సవంలో 25,12,585 దీపాలను ఏకకాలంలో వెలిగించి గిన్నిస్‌ రికార్డును తిరగరాశారు. ఈ ఘనతను స్వయంగా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ న్యాయనిర్ణేత ప్రవీణ్‌ పటేల్‌ ధృవీకరించారు. అదనంగా, 1,121 మంది వేదపండితులు ఏకకాలంలో హారతి నిర్వహించి మరో గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. ఈ సందర్భంగా అయోధ్య నగరం అంతటా లేజర్‌ షో, డ్రోన్‌ షో, రామాయణ ఘట్టాల ప్రదర్శనతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నగర ప్రజలను, భక్తులను మంత్ర ముగ్ధుల్ని చేశాయి ఈసారి దీపావళి, రామమందిరం ప్రాణప్రతిష్ఠ అనంతరం జరుపుకుంటున్న తొలి దీపావళి కావడంతో ఆ వేడుకలు మరింత అట్టహాసంగా నిర్వహించారు. ‘పుష్పక విమానం’ వేషధారుల వింతైన ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హెలికాప్టర్‌ ద్వారా రామాయణ పాత్రధారులు వేషాలు ధరించి దిగిన దృశ్యాలు భక్తులకు మంత్ర ముగ్ధత కలిగించాయి. రథంపై సీతారాములు కూర్చోగా, సీఎం యోగి ఆదిత్యనాథ్‌ సహా మంత్రులు రథాన్ని లాగడం వేడుకలో మరో విశేషం దీపోత్సవం సందర్భంగా, మయన్మార్‌, నేపాల్‌, థాయ్‌లాండ్‌, మలేసియా, కాంబోడియా, ఇండోనేసియా దేశాల కళాకారులు తమ ప్రత్యేక నృత్య, సంగీత ప్రదర్శనలతో వేడుకకు వన్నె తెచ్చారు. నగరమంతా ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసి ప్రకాశవంతం చేయడంతో దీపావళి పర్వదినం ఓ కళా మహోత్సవంలా మారింది.

121 Vedic scholars performed 2. Over 2.5 Million Lamps Lit 3. Guinness World Records Set 585 lamps under a synchronized aarti adding another Guinness and setting a new Guinness World Record Ayodhya's Diwali celebrations broke the previous record creating a magical glow illuminated the city More than 2.5 million earthen lamps River in a grand event. Spectacular Diwali Festivities The lighting of 25 the Uttar Pradesh Tourism initiative were lit by devotees at 55 ghats while 1 with millions of lamps lighting up the banks of the Sarayu World Record

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.