ఆలయంలో సరైన సదుపాయాలు లేక భక్తుల ఇబ్బందులు

ఆలయంలో సరైన సదుపాయాలు లేక భక్తుల ఇబ్బందులు

అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయం కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో ఉన్న అతి ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతిరోజూ భక్తులు స్వామి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే, ఈ ఆలయానికి సంబంధించి కొన్ని అవసరాలు ఇంకా తీర్చబడలేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.2015లో కొంతమేర అభివృద్ధి జరిగి, అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి వారి ఆలయం “కోనసీమ తిరుమల”గా పేరుగాంచింది. కానీ, భక్తులకి మౌలిక సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, ముఖ్యంగా శని, ఆదివారాల్లో, పవిత్ర పండుగల సమయంలో వారికి కష్టాలు ఎదురవుతున్నాయి.

  1. ఆలయ ప్రాంగణంలో శనివారం, ఆదివారం వంటివి రోజుల్లో మాంసపు దుకాణాలు మరియు చేపల మార్కెట్లు ఏర్పాటు చేయడం, భక్తులకు అసౌకర్యంగా మారింది.
  2. ఆలయానికి వచ్చే కార్లు, బైకుల పార్కింగ్ కోసం సరైన స్థలాలు లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారింది.
  3. వశిష్ట వైనితేయి నదీ తీరంలో స్నానం చేసేందుకు భక్తులకు రెండు బాత్రూంలో మాత్రమే సౌకర్యం ఉన్నా, మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని వారు పేర్కొంటున్నారు.
  4. పవిత్ర రోజులలో భక్తులు ఎండలో నిలబడి, క్యూలైన్లు లేకుండా దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు.
  5. అన్నప్రసాద సేవకు సంబంధించి, అప్పనపల్లి ఆలయ వంటశాల చిన్నగా ఉండటంతో, భక్తులు సమయం తీసుకుని అన్నప్రసాదం పొందాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
  6. వీఐపీ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించడం వల్ల సామాన్య భక్తులు కష్టాలు పడుతున్నారు.
  7. ఆలయ ప్రాంగణంలో త్రాగుటకు స్వచ్ఛమైన నీరు అందుబాటులో లేకపోవడం, స్థానికుల కోసం పంచాయతీ నీరు సరఫరా చేయడం అన్యాయమని ఆరోపణలు ఉన్నాయి.
  8. అప్పనపల్లి ఆలయానికి చేరుకోవడానికి సరైన రవాణా సౌకర్యాలు లేవని, ఒకే ఆర్టీసీ బస్సు మాత్రమే పాలకొల్లు వరకు వెళ్ళడం భక్తులకు అసౌకర్యంగా మారింది.
  9. ఆలయ సమీపంలోని కొబ్బరి తోట నది గర్భంలో సముద్రంలో కలిసిపోయింది. ఈ ప్రాంతంలో ఉన్న కొబ్బరి తోటకు నష్టం వాటిల్లింది. ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.అప్పనపల్లి ఆలయ సమీపంలోని మార్గాలు, పార్కింగ్ సౌకర్యాలు, రవాణా సమస్యలపై స్థానికులు, భక్తులు గట్టి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారు కోరుతున్నది, అధికారుల స్పందన, అభివృద్ధి చర్యలు చేపట్టడం. NDAC కూటమి, స్థానిక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు ఈ సమస్యలను పరిష్కరించడంలో సహాయపడాలని భక్తులు కోరుతున్నారు.
Related Posts
వామ్మో నిమ్మకాయ ధర రూ.13 వేలా?
Lemonprice

నిమ్మకాయ తమిళనాడులో చోటుచేసుకున్న ఓ విశేష ఘటన ప్రస్తుతం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సాధారణంగా నిమ్మకాయల ధర రూ.3 లేదా రూ.5 మాత్రమే ఉంటుంది. కానీ ఈరోడ్ Read more

హిందూ ఆలయానికి ముస్లిం భక్తుడి గిప్ట్..
Muslim Bharatanatyam artist

హిందూ ఆలయానికి ముస్లిం భక్తుడు భారీ గిఫ్ట్ అందజేసి వార్తల్లో నిలిచాడు. మనసున్న భక్తుడికి మతం పెద్దది కాదు..అని జహీర్ హుస్సేన్ అనే వ్యక్తి నిరూపించాడు. తమిళనాడులోని Read more

విజన్‌ -2047 వైపు తిరుమల అడుగులు..
tirumala temple

దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక నగరాలు అయిన అయోధ్య, కాశీల తీరులో, ఆంధ్రప్రదేశ్‌ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలను విశ్వవ్యాప్తం చేసే దిశగా టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) Read more

జనవరి 10 నుండి వైకుంఠద్వారదర్శనం
tirumala vanabhojanam

ప్రముఖ వైష్ణవాలయాలలో వైకుంఠద్వార దర్శనాలకు సమయం సమీపిస్తోంది. పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా, ద్వాదశిని వైకుంఠద్వాదశిగా ప్రసిద్ధి. కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

/