Vaishnavi Murder: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన యూట్యూబర్ గంధం వైష్ణవి హత్య ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. తన కూతురిని పొట్టనబెట్టుకున్న నిందితులను వెంటనే ఉరితీయాలంటూ బాధిత కుటుంబ సభ్యులు మరియు బంధువులు రోడ్లపైకి వచ్చి భారీ ఆందోళన చేపట్టారు.
Read also: Adulterated Pickles Hyderabad: జియాగూడలో కల్తీ పచ్చళ్ల గుట్టురట్టు!

Vaishnavi Murder: Protest Demanding Execution of Accused
రహదారిపై భారీ ధర్నా
నిరసనకారులు కొత్త బస్టాండ్ సమీపంలోని జాతీయ రహదారి పై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. కలప దుంగలకు నిప్పు పెట్టి నిరసన తెలపడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిందితుడు హరిబాబుతో పాటు అతని కుటుంబ సభ్యులందరినీ అరెస్ట్ చేయాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు.
పోలీసుల వివరణతో సంతృప్తి చెందిన కుటుంబ సభ్యులు
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. నిందితుడిని ఇప్పటికే రిమాండ్కు తరలించామని, కఠిన శిక్ష పడేలా పక్కా ఆధారాలు సేకరిస్తున్నామని హామీ ఇచ్చారు. పోలీసుల వివరణతో సంతృప్తి చెందిన కుటుంబ సభ్యులు తమ నిరసనను తాత్కాలికంగా విరమించుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: