ఏంటో నేటి ప్రేమలు అర్థం కావడం లేదు. ఇంతలో పరిచయం అంతలోనే పెళ్లి, వెనుతిరిగి చూసుకునేసరికి చావులు, ఆత్మహత్యలు. ఆన్లైన్ ప్రేమను(Online love) వద్దన్నందుకు ఓ 19ఏళ్ల యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ముక్కుమొహం తెలియని వారిని నమ్మేసి, వారురమ్మనచోటుకు వెళ్లి, అర్ధాంతరంగా ప్రియుడి చేతుల్లో బలైపోతున్నారు. తాజాగా ఓ బాలిక, ఓ యువకుడు ప్రేమించుకున్నారు. ఏమైందో ఏమో ఆ యువకుడు బాలిక గొంతుకోసి, ఆపై యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అసలు జీవితం గురించి వీరు ఏం ఆలోచిస్తున్నారు?
Read Also: Mohsin Naqvi: సారీ.. కప్పు కావాలంటే అక్కడికి రావాల్సిందే

ఎందుకని ఇంతటి ఘోరమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు?
ప్రేమించిన బాలికను దారుణంగా హతమార్చిన ఓ యువకుడు ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన కాకినాడు జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గొల్లప్రోలు మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక, అదే గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
బ్లేడ్ తో గొంతుకోసి హత్య
వీరిద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో ఏమో కానీ మంగళవారం అర్ధరాత్రి అశోక్ ఆ బాలికను పనసపాడులోని సుబ్రహ్మనేశ్వసరస్వామి ఆలయం వద్దకు తీసుకువెళ్లాడు. వెంట తెచ్చుకున్న బ్లేడ్లో బాలిక గొంతుకోసం హత్య(Murder) చేశాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై వారు దర్యాప్తు చేస్తున్నారు.
హత్యకు గురైన వారు మరియు ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఎవరు?
హత్యకు గురైంది ఆ గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలిక. ఆత్మహత్య చేసుకున్నది అదే గ్రామానికి చెందిన అశోక్ అనే యువకుడు.
బాలికను ఎక్కడ, ఎలా హత్య చేశారు?
పనసపాడులోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం వద్దకు బాలికను తీసుకువెళ్లి, బ్లేడ్తో ఆమె గొంతు కోసి హత్య చేశాడు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: