Yerraguntla: యర్రగుంట్ల : సరైన పత్రాలు లేకుండా కారులో తరలిస్తున్న రూ.2.52 కోట్ల నగదును యర్రగుంట్ల పోలీసులు గురువారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులు కారులో భారీగా నగదును తరలిస్తుండడంతో పట్టుకున్నట్టు యర్రగుంట్ల సీఐ విశ్వనాధ్ రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు. ముద్దునూరు రోడ్డు నందు వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అనుమానాస్పదంగా ఉన్న కారు ఆపి తనిఖీ చేశారు.
Read Also:Cyber Crime: సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు
బ్యాగు తెరచి చూడగా రూ.2.52 కోట్ల నగదు లభ్యమయ్యింది. వాహనంలో ఇద్దరినీ ప్రశ్నించగా. తమది ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామం అని తాము ప్రొద్దుటూరుకు చెందిన బంగారు వ్యాపారి మీరావలి వద్దా గుమాస్తాలుగా పనిచేస్తున్నామని గుంతకల్లులోని శంకర్ నారాయణ అనే వ్యక్తికి బంగారు నగలు ఇచ్చి డబ్బులు తీసుకెళ్తున్నామని చెప్పారు. అయితే వాటికి సంబంధించి సరైన పత్రాలు లేకపోవడంతో నగదును సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ విశ్వనాధ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగమురళి పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: