వరంగల్(Warangal) పోలీస్ కమిషనరేట్లోని ఏఆర్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న మహిళా కానిస్టేబుల్ అనిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. వరంగల్ జిల్లా(Warangal) పర్వతగిరి మండలం సీత్యతండాకు చెందిన అనిత తీవ్ర మనోవేదనతో గడ్డి మందు తాగి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
Read Also: Delhi Crime: ఆరేళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారం
పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం, అనితకు దూరపు బంధువైన రాజేందర్ గత నాలుగేళ్లుగా పెళ్లి పేరుతో వేధింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అనిత తన స్నేహితుడు జబ్బార్ లాల్తో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో ఆమెపై తప్పుడు ప్రచారం చేశాడని పోలీసులు చెబుతున్నారు.
ఈ విషయాలు తెలుసుకున్న జబ్బార్ లాల్ కూడా అనితను వేధించడంతో ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. ఘటనపై పోలీసులు రాజేందర్, జబ్బార్ లాల్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: