Viveka MurderCase: వివేకా హత్యకేసు వడివడిగా సిబిఐ దర్యాప్తు

Read Time:  1 min
Viveka MurderCase
Viveka MurderCase
FONT SIZE
GET APP

మహేంద్ర యాదవ్, కిరణ్ యాదవ్ ను ప్రశ్నించిన దర్యాప్తు అధికారులు

తమ ప్రాణాలకు ముప్పు ఉందన్న కిరణ్

Viveka MurderCase: పులివెందుల : వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ మరోసారి వేగాన్ని
పెంచింది. మాజీ మంత్రి వైయస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత సుప్రీం కోర్ట్ నందు విచారణపై చేసిన అభ్యంతరాల మేరకు సీబీఐ అధికారులు ముఖ్య నిందితుడైన వైయస్ కుటుంబ బంధువులైన అర్జున్ రెడ్డి, సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ యాధవ్, మహీంద్రా యాదవ్ లను శుక్రవారం సిబిఐ అధికారులు నేరుగా పులివెందులకు చేరుకుని విచారించా రు. యాదాటి కిరణ్ కుమార్ యాదవ్, గొర్ల మహేంద్ర యాదవ్లకు హైదరాబా దులోని సీబీఐ కార్యాలయం లో విచారణకు హాజరుకా వాలంటూ ముందుగా నోటీసులు జారీ అయ్యాయి. వారు హాజరు కాలేమని తెలియజేయడంతో సీబీఐ అధికారులు పులివెందుల పోలీస్ స్టేషన్లోనే విచారణ చేపట్టారు.

Read Also: Cyber Crime: సైబర్ నేరగాడిని అరెస్టు చేసిన పోలీసులు

Viveka MurderCase
Viveka Murder Case: CBI is investigating the Viveka murder case in a hurry

మొదటగా గొర్ల మహేంద్ర యాదవ్ సీబీఐ అధికారుల ముందు హాజరై సుమారు రెండు గంటల పాటు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. అనంతరం స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. అనంతరం వివేకా హత్య కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్ కూడా విచారణకు హాజరయ్యారు. ఇటీవల హైదరాబాద్లో కూడా ఆయనను అర్జున్ రెడ్డితో కలిసి ప్రశ్నించినట్లు సమాచారం. ఈసారి పులివెందులలో సీబీఐ అధికారి రోహిత్ యాదవ్ సుమారు రెండు గంటల పాటు కిరణ్ యాదవ్ను విచారించారు. సునీత రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయిస్తూ కిరణ్ యాదవ్, అర్జున్ రెడ్డి కాలేటాపై విచారణ జరపాలని కోరిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ అంశంపై దృష్టి సారించింది. కిరణ్ యాదవ్ పై అర్జున్ రెడ్డి ల మధ్య గల సంబంధం కాల్ డేట్ పై పలు ప్రశ్నలు వర్షం కురిపించినట్టు తెలిసింది.

వివేకా హత్య కేసులో వరుసగా జరుగుతున్న సీబీఐ విచారణలు కేసును మరింత కీలక దశకు తీసుకెళ్తున్నాయి. కాల్ డేటా విశ్లేషణ, కోర్టు ఆదేశాలు, ప్రత్యక్ష విచారణలతో దర్యాప్తు ముమ్మరమైంది. పులివెందులలో జరిగిన తాజా పరిణామాలు కేసు దిశను ప్రభావితం చేసే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వివేక హత్య కేసులో ఎటు నిందితులుగా ఉన్న సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్ కుమార్ యాదవ్ను సీబీఐ అధికారుల విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన కిరణ్ తో మాట్లాడుతూ సీబీఐ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానన్నారు. కాలేటాపై ప్రశ్నలు అడిగినట్లు తెలిపారు. విచారణకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. తమ ప్రాణాలకు ముప్పు ఉందని ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.