Vijayawada GGH Doctor Death: విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో (GGH) విధుల్లో ఉన్న ఓ యువ వైద్యురాలు ప్రాణాలు కోల్పోవడం వైద్య వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని నింపింది. అనంతపురం జిల్లాకు చెందిన దీపికా అనే విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది.
Read Also: AP: శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి సరఫరా కలకలం
విధుల్లో ఉండగానే అపస్మారక స్థితిలోకి..
దీపికా ఎంబీబీఎస్ పూర్తి చేసి, ప్రస్తుతం విజయవాడ GGHలో జనరల్ మెడిసిన్ విభాగంలో పీజీ చదువుతోంది. బుధవారం రాత్రి నుంచి ఆమె ఆసుపత్రిలో విధుల్లో ఉన్నారు. అయితే, తెల్లవారుజామున ఆమె అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గమనించిన తోటి వైద్యులు వెంటనే అత్యవసర చికిత్స అందించే ప్రయత్నం చేశారు. కానీ, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇంజెక్షనే కారణమా?
మృతురాలు దీపికా గత కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే నొప్పిని భరించలేక ఉపశమనం కోసం ఆమె స్వయంగా ఒక ఇంజెక్షన్ తీసుకున్నట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. ఆ ఇంజెక్షన్ వికటించడం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చని తోటి వైద్యులు మరియు సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
పోస్టుమార్టం నివేదికపైనే అందరి నిఘా
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. దీపికా మృతికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ నివేదిక వెలువడితేనే ఆమె మృతికి కారణం కడుపునొప్పా లేక ఇతర ఆరోగ్య సమస్యలా అనేది స్పష్టమవుతుంది. ఆశయ సాధన కోసం వైద్య వృత్తిని ఎంచుకున్న యువ వైద్యురాలు ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: