Vetlapalem Blast: వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

Read Time:  1 min
Vetlapalem Blast: వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి
FONT SIZE
GET APP

Vetlapalem Blast: కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా తయారీ కేంద్రం పేలుడు ఘటనలో బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఘోర ప్రమాదంలో సదరు పరిశ్రమ యజమాని అడబాల శ్రీను కూడా ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఆయన కుమారులు త్రుటిలో ఈ ప్రమాదం నుంచి తప్పించుకోగా, శ్రీను మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Read Also: Kakinada Blast Incident: కాకినాడలో పేలుడు.. 18 మంది మృతిపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి.

Vetlapalem Blast: Vetlapalem incident.. Industry owner Srinu dies
Vetlapalem Blast: Vetlapalem incident.. Industry owner Srinu dies

మృతుల సంఖ్య మరియు క్షతగాత్రుల పరిస్థితి

ఈ భయానక పేలుడు ధాటికి ఇప్పటివరకు 18 మంది కార్మికులు మృతి చెందినట్లు అధికారిక వర్గాలు ధృవీకరించాయి. తీవ్రంగా గాయపడిన మరో 17 మందిని అత్యవసర చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఛిన్నాభిన్నమైన మృతదేహాలు

పేలుడు తీవ్రత ఎంత భయంకరంగా ఉందంటే, మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా చిధ్రమయ్యాయి. శరీర భాగాలు ఘటనా స్థలానికి దూరంగా చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి గ్రామస్థులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకేసారి ఇన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోవడంతో వేట్లపాలెం గ్రామం శోకసంద్రంలో మునిగిపోయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.