हिन्दी | Epaper
గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు గేమింగ్ కుంభకోణం ‘ఎప్‌స్టీన్’ ప్రకంపనలు ప్రేమ జంట ఆత్మహత్య 50 ల్యాప్ ట్యాప్ లు చోరీ యువకుడి ఆత్మహత్య ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. ‘లాస్ట్ డే’ అని స్టేటస్! ప్రేమ పెళ్లికి అడ్డంగా మారిన తల్లిదండ్రులను హతమార్చిన కూతురు గోదాముల్లో ఘోర అగ్నిప్రమాదం.. 8 మంది మృతి బస్సులో హఠాత్తుగా పొగలు ఒకే రోజు మూడు హత్యలు

Uttar Pradesh: మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం..నిందితుడి ఎన్‌కౌంట‌ర్

Sharanya
Uttar Pradesh: మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం..నిందితుడి ఎన్‌కౌంట‌ర్

ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. లక్నో నగరంలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన నిందితుడు దీపక్ వర్మను పోలీసులు ఎన్‌కౌంటర్‌లో హతమార్చారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర స్పందనకు దారితీసింది. మానవత్వాన్ని మంటగలిపే ఈ ఘటనపై ప్రజలు, నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అపహరణ, అత్యాచారం, ఆ తర్వాత…

గురువారం తెల్లవారుజామున, రద్దీగా ఉండే ఐఎస్‌బీటీ, మెట్రో ప్రాంత సమీపంలోని ఒక వంతెన కింద తల్లితో పాటు నిద్రిస్తున్న చిన్నారిని నిందితుడు అపహరించాడు. తెల్లవారుజామున నిద్రలేచిన కుటుంబ సభ్యులు పాప కనపడకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అనంతరం పాపను అపహరించిన ప్రదేశానికి సుమారు 500 మీటర్ల దూరంలో తీవ్ర గాయాలతో పడి ఉన్న చిన్నారిని దారిన పోయే ఒక వ్యక్తి గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వైద్య పరీక్షల్లో చిన్నారిపై అత్యాచారం జరిగినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం బాలికకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం నాటికి కూడా చిన్నారి పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.

దీపక్ వర్మపై గతం నుంచే కేసులు

వర్మపై లక్నోలోని పలు పోలీస్ స్టేషన్లలో గతంలోనే అనేక క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని, అతను పదే పదే నేరాలకు పాల్పడే వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు. నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి లక్ష రూపాయల రివార్డును కూడా ప్రకటించారు.

పోలీసుల చర్యలు

ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు, నిందితుడిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఆలంబాగ్ మెట్రో స్టేషన్ సమీపంలో నిందితుడు చిన్నారిని స్కూటర్‌పై తీసుకెళ్తున్న దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. స్కూటర్ రిజిస్ట్రేషన్ వివరాల ఆధారంగా నిందితుడిని దీపక్ వర్మగా గుర్తించారు.

20 గంటల్లోనే ముగిసిన చాప్టర్

పోలీసుల గాలింపు ముమ్మరంగా కొనసాగడంతో శుక్రవారం ఉదయం కంటోన్మెంట్ పరిధిలోని దేవి ఖేడా వద్ద దీపక్ వర్మ కదలికలపై స్పష్టమైన సమాచారం వచ్చింది. పోలీసులు అతన్ని అడ్డగించారు. లొంగిపొమ్మని పోలీసులు హెచ్చరించగా, దీపక్ వర్మ వారిపై కాల్పులు జరిపినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో వర్మ తీవ్రంగా గాయపడగా, వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కేవలం 20 గంటల్లోనే నిందితుడిని గుర్తించి, పట్టుకోవడం గమనార్హం.

Read also: Shine Tom Chacko: రోడ్డు ప్రమాదంలో షైన్ టామ్ చాకో తండ్రి మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

వేట్లపాలెం ఘటన.. ప్రమాద తీవ్రతకు కారణాలు ఇవే?

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ పేలుడు ఘటనలో 23కి చేరిన మృతులు సంఖ్య

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

కాకినాడ ప్రమాదంపై డిప్యూటీ సీఎం దిగ్భ్రాంతి

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెంలోని బాణసంచా యజమాని పరారీలో ఉన్నారు: ఆర్‌డీవో

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

వేట్లపాలెం ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఏపీ గవర్నర్

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

ఇరాన్ పాఠశాలపై ఇజ్రాయెల్ బాంబు దాడి: 36 మంది విద్యార్థుల మృతి

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం పేలుడు.. 21 మంది మృతి, 13 మంది గుర్తింపు

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

వేట్లపాలెం ఘటన.. పరిశ్రమ యజమాని శ్రీను మృతి

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

’అమ్మా ఎక్కడున్నావు’ అంటూ కుమార్తెల రోదన!

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

కాకినాడ పేలుడు: హోంమంత్రి అనిత తీవ్ర దిగ్భ్రాంతి

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

18 మంది సజీవదహనం.. ఏపీలో వరుస ప్రమాదాల కలకలం!

📢 For Advertisement Booking: 98481 12870