UP Crime: మైనర్ సిస్టర్స్ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు

Read Time:  1 min
UP Crime: మైనర్ సిస్టర్స్ సూసైడ్ కేసులో షాకింగ్ నిజాలు
FONT SIZE
GET APP

మొబైల్ యాప్ ల మాయలో పడి చిన్నారులు ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు దేశవ్యాప్తంగా అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ (UP Crime) లోని ఘజియాబాద్ లో ఉన్న ఓ అపార్ట్ మెంట్ లో ఇలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది. ఇందులో అపార్ట్ మెంట్లో ఉంటున్న ముగ్గురు మైనర్లు (బాలికలు) అర్ధరాత్రి 9వ అంతస్తు నుంచి కిందకు దూకేశారు. ఒకేసారి ఈ ముగ్గురు అక్కాచెల్లెల్లు ప్రాణాలు కోల్పోయారు.

Read Also: MP: తేనెటీగల దాడి.. 20 మంది చిన్నారుల కోసం ప్రాణత్యాగం చేసిన కుక్

అసలేం జరిగిందంటే..?

ఓ అపార్ట్ మెంట్లో నివసిస్తున్న కుటుంబంలో 12, 14, 16 ఏళ్ల బాలికలు ముగ్గురు ఉన్నారు. వీరి నిన్న అర్ధరాత్రి అంటే ఇవాళ తెల్లవారుజామున రెండు గంటల సమయంలో అపార్ట్ మెంట్ పై నుంచి హఠాత్తుగా దూకి చనిపోయారు. ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి.

up-crime-shocking-facts-in-the-minor-sisters-suicide-case
up-crime-shocking-facts-in-the-minor-sisters-suicide-case

ముగ్గురూ కొరియన్ కల్చర్‌కు అడిక్ట్ అయ్యి పేర్లనూ మార్చుకున్నారని తండ్రి చేతన్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘కొరియాను మా నుంచి ఎవరూ దూరం చేయలేరు’ అని తరచూ అనేవారట. సూసైడ్ లెటర్‌లో ‘అమ్మానాన్న సారీ’ అని ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గది లోపల లాక్ చేసుకొని బాల్కనీ నుంచి దూకినట్లు తేలింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.