Jadcherla: ఇద్దరు కార్మికులు సజీవ దహనం జడ్చర్లలో జిన్నింగ్ మిల్లు వద్ద ఘటన

Read Time:  1 min
Jadcherla
Jadcherla
FONT SIZE
GET APP

జడ్చర్ల : జిన్నింగ్ మిల్లుఅగ్ని ప్రమాదం సంభవించి ఇద్దరు కార్మికులు సజీవ దహనం కావడంతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం జడ్చర్ల(Jadcherla) మండల పరిధిలోని గొల్లపల్లి వద్ద ఉన్న సలసర్ బాలాజీ జిన్నింగ్ మిల్లులో చోటు చేసుకుంది. ఇతర రాష్ట్రాలకు చెందిన అనేక మంది కార్మికులు నిత్యం పనిచేస్తుంటారు. అందులో భాగంగానే మంగళవారం అనుకోకుండా అగ్ని ప్రమాదం సంభవించింది. ఇదే సమయంలో మిల్లులోని బయటికి గాలి ఈడ్చే పైపులైన్ లో చెత్త ఇరుక్కుందని వాటిని తొలగించేందుకు ఒడిశా రాష్ట్రానికి చెందిన పప్పు 26, బీహార్ రాష్ట్రానికి చెందిన హరేందర్ 23 వెళ్లారు.

Read also : Metro Expansion: హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్ర–రాష్ట్ర భాగస్వామ్యం

మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో ఇద్దరు అగ్నికి ఆహుతి

ఈ క్రమంలో అటుపక్క అంటుకున్న మంటలు ఒక్కసారిగా ఎగిసిపడడంతో ఇద్దరు అగ్నికి ఆహుతి అయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఇద్దరికీ ఇటీవలే వివాహం అయిందని తోటి కార్మికులు తెలిపారు. ఈ ఘటనతో బీహార్, ఒడిశా రాష్ట్రానికి చెందిన కార్మికులు కంపెనీ(Company) యజమాన్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీ యజమాన్యం పై దాడికి దిగారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో పోలీసులు అదనపు బలగాలను కంపెనీ వద్దకు రప్పించారు. పోలీసులు భారీ ఎత్తున మోహరించి నిరసన కారులను చెదరగొట్టారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read also :

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.