పవిత్ర దేవస్థానమైన తిరుపతిలో గంజాయి దందా కొనసాగుతున్నది. లక్షలాదిమంది భక్తులు నిత్యం తమ ఇష్టదైవమైన వెంకటేశ్వరుడి స్వామి దర్శనం కోసం తరలి వస్తుంటారు. ఇలాంటి ఆథ్యాత్మిక కేంద్రంలోమత్తుపదార్థాలకు తావులేకుండా అధికారులు కఠిన చర్యలు, తీసుకుంటున్నారు. తిరుమల (Tirumala) కు వెళ్లే వాహనాలను నిత్యం తనిఖీ చేస్తుంటారు. మద్యం, మాంసం వంటి పదర్థాలు లేకుండా చూస్తుంటారు.అసాంఘిక చర్యలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి స్థితిలో గంజాయి రవాణాగుట్టురట్టును చేశారు పోలీసులు. స్థానికంగా తీవ్రకలకలం సృష్టించిన ఈ ఉదంతం వివరాలు పోలీసులుతెలిపారు. తిరుపతిలో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది.దీంతో రెక్కీ నిర్వహించిన పోలీసులు ఇద్దరి నుంచి గంజాయి (Ganja) ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువరూ.80వేలు ఉంటుందని అంచనా. గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇద్దరి నిందితులనుఅదుపులోకి తీసుకున్నారు.
పవిత్రతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు
నిందితులు పుట్టపర్తి జిల్లాకి చెందిన గాలురు చంద్రమోహన్, చిలమత్తూరు
మండలం ఇరసపల్లికి చెందిన అరుణ్ కుమార్ (Arun Kumar) గా గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కుతరలించారు పోలీసులు.పవిత్ర ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతి, తిరుమలలో మత్తుపదార్థాల సరఫరాపై కూటమి ప్రభుత్వం గట్టినిఘాను ఏర్పాటు చేసింది. ఆలయ పవిత్రతకు భంగం కలిగించేవారు ఎవరైనా వారిపై చర్యలుఅతీసుకునేందుకు వెనుకాడమని ఏపీ సీఎంచంద్రబాబునాయుడు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే.
గంజాయి వాడకం వల్ల మానసికంగా ఎలాంటి ప్రభావాలు ఉంటాయి?
గంజాయి వాడకం వల్ల మానసికంగా ఆలస్యం, మతిమరుపు, గమనించే శక్తి లోపం, ఆత్మవిశ్వాసం తగ్గడం, ఒత్తిడి, డిప్రెషన్ వంటి సమస్యలు కలగవచ్చు.
గంజాయి శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
శరీరంలో రక్తపోటు పెరగడం లేదా తగ్గడం, హృదయ స్పందన వేగం పెరగడం (heart rate), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి ప్రభావాలు కనిపించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Vijayarama Raju: ప్రతిభ ఆధారంగానే క్రీడా కార్యదర్శుల నియామకం