Tirupati Road Accident: తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పరపల్లి సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఎం. విక్రమ్ (18) అనే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. తిరుమల నగర్ 5వ క్రాస్ వద్ద విక్రమ్ ప్రయాణిస్తున్న బైకును కారు బలంగా ఢీకొట్టింది.
Read Also: Koduru MLA: కొత్త వీడియోతో సంచలన ఆరోపణలు చేసిన హర్ష వీణ
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన విక్రమ్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి మరణించాడు. మృతుడు కూరగాయల వ్యాపారం ముగించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగినట్లు ప్రాథమిక సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: