మనుషుల జీవితంలో భయం ఒక సహజ భావన. కానీ ఆ భయం మితిమీరితే అది ప్రమాదకరంగా మారుతుంది. కొందరికి ఎత్తైన భవనాలు చూస్తే భయం (Phobia) , ఇంకొందరికి లోతైన నీటి బావులు, మరికొందరికి చీకటి లేదా జంతువుల పట్ల భయం ఉంటుంది. ఇవన్నీ ఫోబియాలుగా పిలవబడే మానసిక వ్యాధుల రూపాలు. అలాంటి ఒక ఫోబియా తాజాగా ప్రాణాలను బలిగొంది. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను కలిచివేసింది.
Read Also: Kerala Crime: ఘోరం.. బాలికపై లైంగిక దాడి
మున్సిపాలిటీ పరిధిలోని శర్వా హోమ్స్కు చెందిన మనీషా (25) అనే వివాహిత.. చీమల ఫోబియా కారణంగా ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది.కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనీషా కొంతకాలంగా చీమల ఫోబియా (Myrmecophobia) తో బాధపడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చూపించినా ఫలితం లేకపోయింది. ఈనెల 4వ తేదీన సాయంత్రం భర్త శ్రీకాంత్ ఆఫీసుకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి.. బెడ్రూమ్ తలుపు లోపల గడియ పెట్టి ఉంది.
నోట్బుక్లో మృతురాలు రాసిన సూసైడ్ నోట్
స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా.. మనీషా (Manisha) చీరతో ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు గదిని పరిశీలించగా.. అక్కడ ఒక నోట్బుక్లో మృతురాలు రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో, ‘శ్రీ.. ఐయాం సారీ.. ఈ చీమలతో బ్రతకడం నావల్ల కావట్లేదు.. కూతురు అన్వి జాగ్రత్త.. అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మొక్కులు తీర్చండి’ అని రాసి ఉంది.
ఈ సూసైడ్ నోట్ ఆమె ఫోబియా తీవ్రతను, మానసిక క్షోభను తెలియజేస్తుంది. సమాచారం అందుకున్న అమీన్పూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: