हिन्दी | Epaper
అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు

Latest News: TG Crime: ఇదెక్కడి వింత.. చీమల భయంతో వివాహిత ఆత్మహత్య

Anusha
Latest News: TG Crime: ఇదెక్కడి వింత.. చీమల భయంతో వివాహిత ఆత్మహత్య

మనుషుల జీవితంలో భయం ఒక సహజ భావన. కానీ ఆ భయం మితిమీరితే అది ప్రమాదకరంగా మారుతుంది. కొందరికి ఎత్తైన భవనాలు చూస్తే భయం (Phobia) , ఇంకొందరికి లోతైన నీటి బావులు, మరికొందరికి చీకటి లేదా జంతువుల పట్ల భయం ఉంటుంది. ఇవన్నీ ఫోబియాలుగా పిలవబడే మానసిక వ్యాధుల రూపాలు. అలాంటి ఒక ఫోబియా తాజాగా ప్రాణాలను బలిగొంది. సంగారెడ్డి జిల్లా (Sangareddy District) అమీన్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఓ ఘటన స్థానికులను కలిచివేసింది.

Read Also: Kerala Crime: ఘోరం.. బాలికపై లైంగిక దాడి

మున్సిపాలిటీ పరిధిలోని శర్వా హోమ్స్‌కు చెందిన మనీషా (25) అనే వివాహిత.. చీమల ఫోబియా కారణంగా ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది.కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మనీషా కొంతకాలంగా చీమల ఫోబియా (Myrmecophobia) తో బాధపడుతోంది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఆస్పత్రిలో చూపించినా ఫలితం లేకపోయింది. ఈనెల 4వ తేదీన సాయంత్రం భర్త శ్రీకాంత్ ఆఫీసుకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చేసరికి.. బెడ్‌రూమ్ తలుపు లోపల గడియ పెట్టి ఉంది.

TG Crime
TG Crime

నోట్‌బుక్‌లో మృతురాలు రాసిన సూసైడ్ నోట్

స్థానికుల సహాయంతో తలుపులు తెరిచి చూడగా.. మనీషా (Manisha) చీరతో ఉరి వేసుకుని కనిపించింది. పోలీసులు గదిని పరిశీలించగా.. అక్కడ ఒక నోట్‌బుక్‌లో మృతురాలు రాసిన సూసైడ్ నోట్ లభించింది. అందులో, ‘శ్రీ.. ఐయాం సారీ.. ఈ చీమలతో బ్రతకడం నావల్ల కావట్లేదు.. కూతురు అన్వి జాగ్రత్త.. అన్నవరం, తిరుపతి, ఎల్లమ్మ మొక్కులు తీర్చండి’ అని రాసి ఉంది.

ఈ సూసైడ్ నోట్ ఆమె ఫోబియా తీవ్రతను, మానసిక క్షోభను తెలియజేస్తుంది. సమాచారం అందుకున్న అమీన్‌పూర్ పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పటాన్‌చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870