మహబూబ్నగర్ జిల్లా పరిధిలో( TG Crime) కులాంతర ప్రేమ వివాహం దారుణ హత్యకు దారితీసిన ఘటన వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లా ఎల్లంపల్లి గ్రామానికి చెందిన రాజశేఖర్పై అతని తమ్ముడి ప్రేమ వివాహం కోపం తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటన గ్రామాన్ని షాక్కు గురిచేసింది. అదే గ్రామానికి చెందిన చంద్రశేఖర్, భవానీలు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. కానీ కుల వైవిధ్యం కారణంగా భవానీ తండ్రి వెంకటేశ్ ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. కుటుంబ పెద్దలు చర్చించినా పెళ్లికి అంగీకరించలేదు.
Read Also: Hyderabad traffic: సాగర్ ఎక్స్ రోడ్డు ఫ్లైఓవర్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్..
పారిపోయి పెళ్లి – అన్నపై టార్గెట్
తండ్రి ఒప్పుకోకపోవడంతో చంద్రశేఖర్, భవానీలు గ్రామం( TG Crime) విడిచి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. ఈ వ్యవహారాన్ని రాజశేఖర్ మద్దతు ఇచ్చాడని వెంకటేశ్ అనుమానపడ్డాడు. ఇదే కారణంగా గత కొద్ది రోజులుగా రాజశేఖర్పై ఆయనకు కోపం పెరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. భవానీ తండ్రి వెంకటేశ్ మరో ఐదుగురితో కలిసి రాజశేఖర్ను కిడ్నాప్ చేశాడు. అనంతరం అతడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి హత్య చేసినట్లు సమాచారం. ఈ దారుణం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
ప్రమాదకరమైన ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో కొంతమంది పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారు చెప్పారు. మృతుడు రాజశేఖర్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కులాంతర వివాహాన్ని అంగీకరించకపోవడం వల్ల మరో కుటుంబం విషాదంలో మునిగిపోయింది. గ్రామస్తులు ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకూడదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రేమపై ద్వేషం, కులం పేరుతో హింస ఇంకా కొనసాగుతుండటంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: