Latest News: TG Crime: నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి

Read Time:  1 min
Latest News: TG Crime: నిజామాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం.. ఒకరు మృతి
FONT SIZE
GET APP

(TG Crime) నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలో కాల్పులు కలకలం రేపాయి. లారీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు, మరో లారీ డ్రైవర్‌ను కాల్చి చంపి పరారయ్యారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. మహమ్మద్ సల్మాన్ అనే వ్యక్తి తన లారీని 44వ జాతీయ రహదారి పక్కన గల పెట్రోల్ బంకులో నిలిపి ఉంచాడు. అదే సమయంలో మరో లారీలో వచ్చిన ముగ్గురు వ్యక్తులు,

Read Also: TG Crime: గొంతులో అన్నం ముద్ద ఇరుక్కుని వ్యక్తి మృతి

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే

(TG Crime) నిలిపి ఉంచిన లారీలో ఉన్న సల్మాన్‌పై తుపాకీతో కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు.తీవ్రంగా గాయపడిన సల్మాన్‌ను స్థానికులు వెంటనే ఇందల్‌వాయిలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

TG Crime: Gunfire incident in Nizamabad district creates panic; one person dead
TG Crime: Gunfire incident in Nizamabad district creates panic; one person dead

కాల్పులు జరిపిన దుండగులు, తాము వచ్చిన లారీని చంద్రాయన్‌పల్లి వరకు తీసుకువెళ్లి, అక్కడ ఒక దాబా వద్ద వదిలి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించి, దర్యాప్తు ప్రారంభించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.