NYC Mayor Zohran Mamdani: న్యూయార్క్ నగర తొలి ముస్లిం మేయర్ జోహ్రాన్ మమ్దానీ అధికారిక నివాసమైన ‘గ్రేసీ మాన్షన్’ లక్ష్యంగా బాంబు దాడికి విఫలయత్నం జరిగింది. ముఖ్యంగా రెండు విరుద్ధ నిరసన బృందాల మధ్య ఘర్షణలు తీవ్రరూపం దాల్చిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రైట్ వింగ్ యాక్టివిస్ట్ జేక్ లాంగ్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది. సుమారు 20 మంది మద్దతుదారులు అక్కడ చేరగా.. వారికి వ్యతిరేకంగా 100 మందికి పైగా కౌంటర్ ప్రొటెస్టర్లు నినాదాలు చేశారు.
Read Also: Kamareddy crime: చెరువులో ముగ్గురు చిన్నారుల మృతదేహాలు!
పిడిగుద్దులతో దాడులు
ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారితీసింది. లాంగ్ మద్దతుదారులు పెప్పర్ స్ప్రే చల్లడంతో పరిస్థితి అదుపు తప్పింది. ఇరువర్గాలు గుడ్లు విసురుకుంటూ, పిడిగుద్దులతో దాడులు చేసుకున్నాయి. ఈ గొడవలో ఓ వ్యక్తి పొగలు వెదజల్లే రెండు వస్తువులను జనం మధ్యలోకి విసిరాడు. అవి ఈస్ట్ 87వ వీధిలో పడి మంటలు రావడంతో జనం భయంతో పరుగులు తీశారు. ఇవి టేపుతో చుట్టిన జాడీలని, అందులో నట్లు, బోల్టులు, స్క్రూలు నింపి ఉన్నాయని, అలాగే ఫ్యూజ్ కూడా అమర్చారని పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ తెలిపారు.
బాంబ్ స్క్వాడ్ బృందాలు వీటిని పరిశీలిస్తున్నాయి.ఘటన జరిగిన సమయంలో మేయర్ మమ్దానీ, ఆయన భార్య ఇంట్లో లేరని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దాడిని మేయర్ ప్రతినిధి తీవ్రంగా ఖండించారు. ఇది ముస్లిం వ్యతిరేక చర్య అని, అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. పేలుడు వస్తువులు విసిరిన 18 ఏళ్ల ఎమిర్ బాలాట్, అతనికి సహకరించిన 19 ఏళ్ల ఇబ్రహీం నిక్, పెప్పర్ స్ప్రే చల్లిన ఇయాన్ మెక్గిన్నిస్తో పాటు మొత్తం ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఉద్రిక్తత కొనసాగుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: