కామారెడ్డి రైస్ మిల్లులో దళిత మహిళపై అత్యాచారం
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో ఒక దళిత మహిళపై రైస్ మిల్లు కార్మికులు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా బయటపడింది. ఈ సంఘటన పాల్వంచ మండలం(Telangana Crime) ఫర్దిపేట గ్రామంలో నిన్నటికి రెండు రోజుల ముందు జరిగినట్లు తెలిసింది. బీహార్ నుంచి వచ్చిన ఈ కార్మికులు మద్యం మత్తులో ఉండటం వలన ఈ అమానవీయ చర్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బాధితురాలు పత్తి చేనులోకి నడుచుకుంటూ వెళుతుండగా, రైస్ మిల్లు సమీపంలో కాపుకాసి ఉన్న కార్మికులు ఆమెను అటకాయించి, రోడ్డు పక్కనున్న పొదల్లోకి లాగుకెళ్లి అత్యాచారం చేశారు. ఘటన తర్వాత తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాధితురాలిని స్థానికులు కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Read also: భారత్-చైనా మధ్య విమాన సర్వీసులు ఐదేళ్ల తర్వాత పునరుద్ధరణ
ఆందోళన, పోలీసులు దర్యాప్తు ప్రారంభం
ఈ ఘటన గురించి తెలిసిన దళిత(Telangana Crime) సంఘాలు సోమవారం ఉదయం రైస్ మిల్లు ముందు తీవ్ర ఆందోళన తెలిపాయి. అత్యాచారంలో పాల్గొన్న కార్మికులను వెంటనే అరెస్టు చేయాలని, బాధితురుకు న్యాయం లభించేలా చూడాలని వారు డిమాండ్ చేశారు. గతంలో కూడా బీహార్ నుంచి వచ్చిన రైస్ మిల్లు కార్మికులు ఇలాంటి అమానవీయ ఘటనలకు పాల్పడినట్లు ఆందోళనకారులు గుర్తుచేశారు.
రైస్ మిల్లు యజమాని కూడా ఈ ఘటనకు బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటన తర్వాత పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేసి, విచారణ ప్రారంభించారు. సంబంధిత కార్మికులను అరెస్టు చేసి న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: