Blackmail suicide case : పెళ్లి సంబరాలతో కళకళలాడాల్సిన ఇంటిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రియురాలి బ్లాక్మెయిల్, ఆర్థిక వేధింపులను తట్టుకోలేక ఓ వ్యాపారి ఆత్మహత్య చేసుకున్న ఘటన సూరత్లో కలకలం రేపింది. కుమార్తె వివాహానికి కేవలం కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉండగా ఈ ఘటన జరగడం కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది.
సూరత్కు చెందిన వ్యాపారి ఘేలానీ జనవరి 31 రాత్రి తన లైసెన్స్డ్ రివాల్వర్తో మెడపై కాల్చుకున్నారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఫిబ్రవరి 4న మరణించారు. తన తండ్రి మరణానికి పూనమ్ బెన్ భదౌరియా అనే మహిళే కారణమని ఆరోపిస్తూ మృతుడి కుమార్తె ఫిబ్రవరి 12న పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లికి ముందు ఆ మహిళ ఇబ్బందులు సృష్టిస్తుందేమోనని తండ్రి భయపడేవారని ఆమె తెలిపింది.
Read Also: UP Crime News: భార్య, పిల్లల్ని చంపి వ్యక్తి ఆత్మహత్య

దర్యాప్తు చేపట్టిన ఉమ్రా పోలీసులు ఘేలానీ, పూనమ్ మధ్య చాలాకాలంగా రహస్య సంబంధం ఉన్నట్లు గుర్తించారు. ఘేలానీ బ్యాంక్ ఖాతా నుంచి ఆమెకు భారీ మొత్తంలో డబ్బు బదిలీ అయినట్లు ఆధారాలు లభించాయి. ఆర్థిక ఒత్తిడి, బ్లాక్మెయిల్ కారణంగానే అతను తీవ్ర మనోవేదనకు గురై ఈ నిర్ణయం తీసుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు.
ఈ కేసులో ఆత్మహత్యకు ప్రేరేపణ (IPC సెక్షన్ 306) అభియోగంపై పూనమ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో మరెవరైనా సంబంధం ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. పెళ్లి ఇంటిలో జరగాల్సిన వేడుకలు విషాదంలో ముగియడం స్థానికంగా చర్చనీయాంశమైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: