హరియాణా ఫరీదాబాద్లో జరుగుతున్న సూరజ్కుండ్(Surajkund) అంతర్జాతీయ హస్తకళల మేళాలో తీవ్ర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం భారీ ‘సునామీ స్వింగ్’ జాయ్ రైడ్ అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Read Also:love marriage tragedy : పుత్తూరు విషాదం, ప్రేమ వివాహం చివరికి ఏం చేసింది?
ప్రమాదం సమయంలో ఆ రైడ్లో అనేక మంది ప్రయాణికులు ఉన్నారు. రైడ్ కూలిన వెంటనే అక్కడ తొక్కిసలాట చోటుచేసుకోవడంతో సందర్శకులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. జాయ్ రైడ్ నిర్వహణకు బాధ్యులైన ఆపరేటర్పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై విచారణ కొనసాగుతోంది.
ఈ ఘటనలో(Surajkund) విధి నిర్వహణలో ఉన్న హరియాణా పోలీస్ ఇన్స్పెక్టర్ జగదీష్ ప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. రైడ్లో ఉన్న వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో ఒక భారీ భాగం ఆయనకు బలంగా తగలడంతో తీవ్ర గాయాలపాలై మరణించినట్లు సమాచారం.
ఈ ఘటనపై హరియాణా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఇన్స్పెక్టర్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశిస్తూ, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయంగా ఉంటుందని హామీ ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: