Stalin: తమిళనాడులో ప్రముఖులపై బెదిరింపులు మరోసారి అలజడి రేపాయి. ఆదివారం రాత్రి సీఎం ఎంకే స్టాలిన్ (M.K Stalin) తో పాటు నటులు అజిత్, అరవింద్ స్వామి, ఖుష్బూ నివాసాల్లో బాంబులు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తులు ఈ-మెయిల్ ద్వారా తెలియజేశారు. డీజీపీ కార్యాలయానికి కూడా అదే మెయిల్ చేరడంతో పోలీసులు వెంటనే బాంబు స్క్వాడ్ను పంపించి ఇళ్ల వద్ద విస్తృత తనిఖీలు చేపట్టారు. గంటలపాటు కొనసాగిన సోదాల్లో ఏ పేలుడు పదార్థం కూడా కనిపించకపోవడంతో ఇది తప్పుడు అలారమని అధికారులు నిర్ధారించారు.
Read also: IBOMMA: రవి కేసులో షాకింగ్ విషయాలు.. కిక్కు కోసమే హ్యాకింగ్!
Stalin: Bomb threats to CM Stalin and film celebrities in Chennai!
అజిత్ ఇంటికి కూడా ఫోన్
Stalin: ఇటీవలి రోజుల్లో చెన్నైలో ఇలాంటి బెదిరింపులు పెరగడం పోలీసులు ఆందోళనగా చూస్తున్నారు. గత వారం అజిత్ ఇంటికి కూడా ఫోన్ ద్వారా ఇలాంటి హెచ్చరిక రావడం గమనార్హం. అరుణ్ విజయ్, ఇళయరాజా వంటి ప్రముఖులకూ ఇదే తరహా బెదిరింపులు రావడంతో ఇవన్నీ ఆకతాయిల పనేనని భావిస్తున్నారు. బాధ్యులను గుర్తించేందుకు సైబర్ టీమ్ మెయిల్స్ను ట్రాక్ చేస్తూ దర్యాప్తు కొనసాగిస్తోంది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: