Latest Telugu News: Syrup: కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్

Read Time:  1 min
Syrup:'దగ్గు మందు'పై దర్యాప్తు​- ఏడు ప్రాంతాల్లో ఈడీ దాడులు
Syrup:'దగ్గు మందు'పై దర్యాప్తు​- ఏడు ప్రాంతాల్లో ఈడీ దాడులు
FONT SIZE
GET APP

మధ్యప్రదేశ్‌ ఛింద్వారా జిల్లాలో కలుషితమైన దగ్గు సిరప్(Cough Syrup) తీసుకుని పదుల సంఖ్యలో చిన్నారులు మృతి చెందిన విషాద ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనలో మరణించిన చిన్నారుల సంఖ్య 20కి చేరింది. దీనికి కారణమైన ‘కోల్డ్రిఫ్’ దగ్గు సిరప్‌(Cough Syrup) ను తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసింది. మధ్యప్రదేశ్ పోలీసులు శ్రీసన్ ఫార్మా కంపెనీ ఓనర్‌ని గురువారం ఉదయం అరెస్ట్ చేశారు. శ్రీసన్ ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్లు మూడు రోజుల నుంచి పరారీలో ఉన్నారు.
న్నారులకు ఈ కలుషితమైన సిరప్‌ను సూచించిన డాక్టర్ ప్రవీణ్ సోనిని ఇప్పటికే అరెస్టు చేశారు. దీంతో పాటు, సిరప్(Syrup) తయారీకి బాధ్యులైన తమిళనాడులోని కాంచీపురం కేంద్రంగా పనిచేస్తున్న శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ డైరెక్టర్లు, ఇతర బాధ్యులపై కేసు నమోదు చేశారు. కోల్డ్రిఫ్ సిరప్‌లో అత్యంత విషపూరితమైన డైఇథైలిన్ గ్లైకాల్ అధిక మోతాదులో ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.

Bihar Elections: బీహార్ ఎన్నికలు: ఎన్డీఏలో మొదలైన సీట్ల వివాదం

Syrup: కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్
Syrup: కలుషిత దగ్గు సిరప్ కేసులో శ్రీసన్ ఫార్మా ఓనర్ అరెస్ట్

డైఇథైలిన్ గ్లైకాల్ ఉన్నట్లు నిర్ధారణ

తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టరేట్, అలాగే మధ్యప్రదేశ్ డ్రగ్ టెస్టింగ్ లాబొరేటరీ నిర్వహించిన పరీక్షల్లో ‘కోల్డ్రిఫ్’ సిరప్‌లో 46% నుంచి 48% వరకు డైఇథైలిన్ గ్లైకాల్ ఉన్నట్లు నిర్ధారించారు. యాంటీ-ఫ్రీజ్, బ్రేక్ ఫ్లూయిడ్‌లలో ఉపయోగించే ఈ విషపూరిత రసాయనం, సేవించిన చిన్నారుల కిడ్నీలు పూర్తిగా దెబ్బతినడానికి కారణమైంది. ఈ విషాదంలో మరణించిన చిన్నారుల సంఖ్య 14కు పైగా పెరిగినట్లు సమాచారం. ఈ ఘటనతో మధ్యప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు ‘కోల్డ్రిఫ్’ సిరప్‌ అమ్మకాలను తక్షణమే నిలిపివేసి, స్టాకును సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కూడా దేశవ్యాప్తంగా దగ్గు సిరప్‌ల నాణ్యత, సరైన వినియోగంపై కఠినమైన చర్యలకు ఉపక్రమించింది.

గృహ చిట్కాలు

దగ్గును తగ్గించుకోవడానికి, గోరువెచ్చని నీరు, తేనె, అల్లం, పసుపు, మిరియాలు వంటివి ఉపయోగించవచ్చు; ఆవిరి పీల్చడం, ధూమపానం వంటి చికాకులను నివారించడం, పుష్కలంగా ద్రవాలు తాగడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం వంటివి చేయాలి. 

రాత్రిపూట దగ్గు ఎందుకు వస్తుంది?

రాత్రి దగ్గు రావడానికి ప్రధాన కారణాలు శరీరంలో శ్లేష్మం పేరుకుపోవడం, అలర్జీలు, యాసిడ్ రిఫ్లక్స్, మరియు పడకగదిలోని గాలి నాణ్యత అని  తెలియజేస్తున్నాయి. పడుకున్నప్పుడు శ్వాసనాళాల్లో శ్లేష్మం చేరి దగ్గును ప్రేరేపిస్తుంది, అలాగే దుమ్ము, పుప్పొడి వంటివి దగ్గును తీవ్రతరం చేస్తాయి. 

Read hindi news: hindi.vaartha.com

EPaper: https://epaper.vaartha.com/

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.