📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

టూరిస్ట్ మహిళ అత్యాచారం వేగంగా దర్యాప్తు

Author Icon By Sharanya
Updated: March 8, 2025 • 4:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కర్ణాటకలోని గంగావతి ప్రాంతంలో చోటుచేసుకున్న దారుణమైన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనలో విదేశాలకు చెందిన పర్యాటకులు దుండగుల దాడికి గురికావడం, ఓ వ్యక్తి మృతిచెందడం, ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం జరగడం తీవ్ర కలకలం రేపింది. ప్రస్తుతం పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, వారు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారని అధికారులు వెల్లడించారు.

ఘటన వివరాలు

గురువారం నాడు ఇజ్రాయెల్‌కు చెందిన ఓ యువతి, అమెరికాకు చెందిన ఓ యువకుడు, మహారాష్ట్ర నాసిక్‌కు చెందిన పంకజ్, ఒడిశాకు చెందిన బిబాస్ అనే వ్యక్తులు కర్ణాటకలోని గంగావతి ప్రాంతానికి పర్యటనకు వచ్చారు. వీరంతా ఆనెగుందిలోని అంబికా నాయక్ హోం స్టేలో బస చేశారు. పర్యటనలో భాగంగా రాత్రి సమయం వద్ద సణాపుర చెరువు సమీపంలోని రంగాపుర గంగమ్మ గుడి వద్ద సంగీత కార్యక్రమం నిర్వహించడంతో పాటు అక్కడ ఆనందంగా గడిపారు. ఈ సమయంలో కొందరు గుర్తు తెలియని దుండగులు ఆ ప్రదేశానికి చేరుకుని, ముందుగా పెట్రోల్ ఎక్కడ దొరుకుతుందంటూ వారితో మాటలు కలిపారని అనంతరం రూ.100 ఇవ్వాలని డిమాండ్ చేశారని తెలిపారు. దానికి పర్యటకులు నిరాకరించడంతో ఆగ్రహానికి గురైన దుండగులు పర్యటకులపై దాడి చేసి, పంకజ్, బిబాస్, డేనియల్ను పక్కనే ఉన్న కాలువలోకి తోసేశారు. పంకజ్, డేనియల్ ఈదుతూ ఒడ్డుకు చేరుకోగా బిబాస్ నీటి ఉద్ధృతికి గల్లంతయ్యాడు. పురుషులను కాలువలోకి తోసి మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం దుండగులు అక్కడినుంచి పారిపోయారని తెలిపారు. ప్రస్తుతం బాధిత మహిళలు స్థానిక ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు. 

ఈ ఘటనపై కొప్పల్ జిల్లా పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హోంస్టే, సంఘటన ప్రదేశం పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. హోంస్టే యజమాని సహా స్థానిక ప్రజల వాంగ్మూలాలను రికార్డు చేస్తున్నారు. అత్యాచారానికి గురైన మహిళల వైద్య పరీక్షలు నిర్వహించగా, నివేదిక అధికారులకు అందినట్లు సమాచారం. సూపరింటెండెంట్ రామ్ ఎల్ అరసిద్దికి ఫిర్యాదు చేసినట్లు స్థానిక మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి నిందితుల కోసం గాలింపుచర్యలు కొనసాగుతున్నాయని నిందితులను త్వరగా అరెస్టు చేయడమే తమ ప్రాథమిక లక్ష్యమని పోలీసులు స్పష్టం చేశారు.

#crimenews #GangavathiIncident #KarnatakaCrime #StopViolence #TouristAttack #TouristSafety #WomenSafety Breaking News in Telugu Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.