📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు

సౌందర్య మరణం పై ఆమె భర్త వివరణ

Author Icon By Anusha
Updated: March 13, 2025 • 4:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలుగు సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు పొందిన నటి సౌందర్య మరణానికి సంబంధించి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె మరణం ప్రమాదవశాత్తూ జరిగింది కాదని, ఇందులో కొన్ని కుట్రలు ఉన్నాయనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఈ వ్యవహారంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు పేరు కూడా వార్తల్లో ప్రస్తావించబడుతోంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆరోపణలు

సోషల్ మీడియాలో కొన్ని వర్గాలు సౌందర్య ఆస్తులకు సంబంధించి మోహన్ బాబు అక్రమంగా వాటాను స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణలు చేస్తున్నారు.ఖమ్మం జిల్లా సత్యనారాయణపురానికి చెందిన చిట్టిమల్లు అనే వ్యక్తి, హైదరాబాద్ శివారు జల్‌పల్లిలో ఉన్న గెస్ట్ హౌస్ ఒకప్పటి హీరోయిన్ సౌందర్యదని పేర్కొంటూ ప్రముఖ నిర్మాత, నటుడు మోహన్ బాబు బలవంతంగా దానిని స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు.అంతేకాకుండా, ఆ గెస్ట్ హౌస్‌ను తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని అనాధ ఆశ్రమం లేదా మిలిటరీకి అప్పగించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా, మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్‌తో పాటు జిల్లా కలెక్టరేట్‌కు ఫిర్యాదు చేశారు.

సౌందర్య భర్త రఘు స్పందన

ఈ ఆరోపణలపై సౌందర్య భర్త రఘు అధికారికంగా స్పందించారు. ఆయన ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేస్తూ ఓ లేఖ విడుదల చేశారు.మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి వివాదాలు లేవని, ఈ విషయాన్ని అసత్య ప్రచారంగా కొట్టిపారేశారు.సౌందర్య, మోహన్ బాబుల మధ్య ఎలాంటి భూ లావాదేవీలు జరగలేదని స్పష్టం చేశారు.ఇద్దరి కుటుంబాల మధ్య గత 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని, ఎవరూ ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని కోరారు.తాను మోహన్ బాబును ఎంతో గౌరవిస్తానని, తమ కుటుంబం ఒకటే అని చెప్పారు.ఇలాంటి తప్పుడు ప్రచారాలను వెంటనే ఆపాలని రఘు విజ్ఞప్తి చేశారు.

ఆరోపణలు

తెలుగు సినీ పరిశ్రమలో మోహన్ బాబు సినీ పరిశ్రమలో ఓ విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. ఆయన గతంలోనే సౌందర్యకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నారని, ఆమె కెరీర్‌లో కీలకంగా మద్దతిచ్చారని సినీ వర్గాలు చెబుతుంటాయి.సౌందర్య మరణం విషాదం విమాన ప్రమాదంలో ఆమె చనిపోయింది. అయితే, ఆమె మరణానికి సంబంధించి అప్పట్లోనే కొన్ని వదంతులు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ఆస్తి వివాదాల కోణంలో ఈ వార్తలు బయటకు రావడం గమనార్హం.సినీ పరిశ్రమలో పలు రకాల వార్తలు, వదంతులు ఎప్పుడూ లేవనెత్తబడుతూనే ఉంటాయి. కానీ సౌందర్య భర్త రఘు స్వయంగా స్పందించి, ఈ ఆరోపణల్ని ఖండించడం కీలకంగా మారింది. నిజం తెలుసుకోకుండా అనవసరమైన ఆరోపణలు చేయడం, వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లడం తప్పని, ఇలాంటి వదంతులను ప్రజలు నమ్మకూడదని ఆయన విజ్ఞప్తి చేశారు.

#FactCheck #FakeNews #MohanBabu #MohanBabuControversy #RaghuStatement #RaghuStatement #SocialMediaRumors #Soundarya #SoundaryaHusband #TollywoodNews #ViralNews Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.