📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest News: Sonia Gandhi: సోనియా, రాహుల్‌పై క్రిమినల్ కుట్ర కేసు నమోదు?

Author Icon By Anusha
Updated: November 30, 2025 • 11:05 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎన్ని ఏళ్ళు గడిచినా నేషనల్ హెరాల్డ్ కేసు సోనియా (Sonia Gandhi), రాహుల్ గాంధీలను వదిలిపెట్టడం లేదు. దీనికి సంబంధించి కొత్త కేసులు పెడుతూనే ఉన్నారు. నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ (Sonia Gandhi), రాహుల్ గాంధీకి చిక్కులు మరింత పెరిగాయి. వీరిద్దరిపై క్రిమినల్ కుట్ర ఆరోపణలతో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ) తాజాగా ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో మొత్తం ఆరుగురు వ్యక్తులు, మూడు కంపెనీలను నిందితులుగా చేర్చారు.

Read Also: Sri Lanka cyclone : శ్రీలంకను శోకసంద్రంలో ముంచిన దిత్వా తుపాను.. ఇప్పుడు భారత్ వైపు కదలికలు…

Sonia Gandhi: Criminal conspiracy case registered against Sonia, Rahul?

క్రిమినల్ కుట్ర పన్నారన్నది ప్రధాన ఆరోపణ

వీరితో పాటు శామ్ పిట్రోడా, మరో ముగ్గురు వ్యక్తుల పేర్లను కూడా ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. వీరితో పాటు అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్), యంగ్ ఇండియన్, డోటెక్స్ మర్చండైజ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలపైనా కేసు నమోదైంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక మాతృ సంస్థ అయిన ఏజేఎల్‌ను మోసపూరితంగా చేజిక్కించుకునేందుకు క్రిమినల్ కుట్ర పన్నారన్నది ప్రధాన ఆరోపణ.ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అందించిన దర్యాప్తు నివేదిక ఆధారంగా అక్టోబర్ 3న ఈ ఎఫ్ఐఆర్ దాఖలైంది.

కోల్‌కతాకు చెందిన డోటెక్స్ అనే షెల్ కంపెనీ నుంచి యంగ్ ఇండియన్ సంస్థకు రూ. కోటి అందిందని, ఈ నిధులతో కాంగ్రెస్ పార్టీకి రూ. 50 లక్షలు చెల్లించి, సుమారు రూ. 2,000 కోట్ల విలువైన ఏజేఎల్ ఆస్తులను యంగ్ ఇండియన్ నియంత్రణలోకి తీసుకుందని ఎఫ్ఐఆర్‌లో ఆరోపించారు. యంగ్ ఇండియన్‌లో సోనియా, రాహుల్ గాంధీలకు 76 శాతం వాటాలు ఉన్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

EOW FIR latest news Money Laundering Case national herald case rahul gandhi sonia gandhi Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.