
మధ్యాహ్నం సమయంలో జరిగిన ఈ ప్రమాదం పలు కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. మినీ వ్యాన్ను ఓ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆ వెనుకే మరో బైక్ కూడా ఢీ కొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 11 నెలల చిన్నారి సహా ఎనిమిది మంది అక్కడికక్కడే చనిపోయారు. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చనిపోవడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. బైక్ పై వచ్చిన తల్లి కూతురు మరణించారు. మరో ఆరుగురికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Read Also: Gautam Gambhir: పర్సనాలిటీ రైట్స్ కోసం గంభీర్ పోరాటం.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: