📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. ఆస్ట్రేలియాలో ఉగ్ర కుట్ర భగ్నం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ…

Saleem: మద్యం మత్తులో భార్య అనుకుని పక్కింటి యువతిని పొడిచిన భర్త

Author Icon By Sharanya
Updated: June 8, 2025 • 11:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

హైదరాబాద్ (Hyderabad) నగరంలోని మైలార్‌దేవ్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి దారుణమైన ఘటన చోటుచేసుకుంది. దంపతుల మధ్య తలెత్తిన గొడవను అదుపు చేయడానికి ప్రయత్నించిన ఒక యువతిని భార్యగా భావించి వ్యక్తి కత్తితో పొడిచాడు. దాంతో ఆ యువతి తీవ్రంగా గాయపడింది. బాధితురాలు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతోంది.

వివరాలు

మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన సలీమ్ (60), రేష్మ దంపతులకు ఇద్దరు సంతానం. వారిలో ఒకరు మానసిక వ్యాధితో బాధపడుతుండగా, మరొక కూతురు హైదరాబాద్ మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ టీఎన్‌జీవోస్ కాలనీలో నివాసముంటోంది. బక్రీద్ పండుగ సందర్భంగా సలీం దంపతులు హైదరాబాద్‌లోని తమ కూతురి ఇంటికి వచ్చారు.

సలీం (Saleem) మద్యం సేవించి వచ్చి భార్య రేష్మతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో రేష్మను చంపేస్తానంటూ కూరగాయలు కోసే కత్తితో బెదిరించాడు. దీంతో ఆమె కేకలు వేసుకుంటూ బయటకు పరుగులు తీసింది. వారి గొడవను ఆపేందుకు పక్కింట్లో ఉంటున్న జుబేదా (26) అక్కడికి చేరుకుంది. అయితే జుబేదా వచ్చిన విషయాన్ని గమనించని సలీమ్, ఆమెను తన భార్య రేష్మగా భావించి కత్తితో పొడిచాడు.

దీంతో జుబేదా (Zubeida) తీవ్రంగా గాయపడి కుప్పకూలింది. గమనించిన స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు ఫోన్ చేసి, పోలీసులకు సమాచారం అందించారు. మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన జుబేదాను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

పోలీసుల స్పందన:

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గాయపడిన జుబేదాను ఆసుపత్రికి తరలించారు. సలీంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆకస్మికంగా దాడి చేసినందుకు సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Read also: Maganti Gopinath: నేడు మధ్యాహ్నం మాగంటి అంత్యక్రియలు..ప్రముఖుల సంతాపం

#BetrayedByMistake #CrimeAlert #DomesticViolence #DrunkenRage #HyderabadNews #MylarDevpally #SalimAttack #telangana Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu India News in Telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.