ఝార్ఖండ్ రాజధాని రాంచీలోని(Ranchi) అశోక్ నగర్ (కద్రు ప్రాంతం)లో సోమవారం చోటుచేసుకున్న ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, 24 ఏళ్ల మిహిర్ అఖౌరీ అనే యువ చార్టర్డ్ అకౌంటెంట్ ప్రాణాలు కోల్పోయాడు. అతడి తల్లి స్నేహ అఖౌరీ, 14 ఏళ్ల సోదరి ప్రస్తుతం ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్నారు.
Read Also:Karnataka: అత్తింటి వేధింపులు.. ముగ్గురు పిల్లలను ఉరేసి చంపి తల్లి ఆత్మహత్యాయత్నం

ఇటీవలే చదువు పూర్తి చేసుకున్న మిహిర్
మిహిర్ అఖౌరీ ఇటీవల కోల్కతాలో తన చార్టర్డ్ అకౌంటెన్సీ పూర్తి చేసి రాంచీకి తిరిగి వచ్చాడు. అతడికి ఒక కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం కూడా లభించినట్లు సమాచారం. అతడి తల్లి స్నేహ అఖౌరీ (50) ఝార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం సుమారు 2:30 గంటల సమయంలో ఇంటి నుంచి అరుపులు వినిపించడంతో పొరుగువారు లోపలికి వెళ్లి చూడగా ఈ విషాదం బయటపడింది. సమాచారం అందుకున్న అర్గోరా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి మిహిర్ ఉరివేసుకుని మృతి చెందాడు.
విషగుళికలు మింగిన తల్లి, కుమార్తె
మిహిర్ తల్లి స్నేహ అఖౌరీ, ఆమె మైనర్ కుమార్తె విషగుళికలు మింగి అపస్మారక స్థితిలో ఉండటంతో వారిని వెంటనే గురునానక్ ఆసుపత్రికి(Ranchi) తరలించారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని వైద్యులు తెలిపారు. పొరుగువారి సమాచారం ప్రకారం ఆ కుటుంబం గత కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇదే ఈ అఘాయిత్యానికి కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదు.
మిహిర్ మృతదేహానికి పోలీసులు పోస్ట్మార్టం నిర్వహించారు. ఆర్థిక లావాదేవీలపై దృష్టి సారించి దర్యాప్తు కొనసాగుతున్నట్లు అర్గోరా పోలీస్ స్టేషన్ ఇన్చార్జ్ అనిల్ కుమార్ తివారీ తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తల్లి, కుమార్తె కోలుకుని స్టేట్మెంట్ ఇస్తేనే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: