📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Railway ASM Exam: రైల్వే ఎఎస్ఎం పరీక్ష ప్రశ్నా పత్రం లీకేజీ కేసు పూర్వాపరాలు

Author Icon By Anusha
Updated: July 24, 2025 • 3:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రెండు దశాబ్దాల క్రితం రైల్వేలో సంచలనం సృష్టించిన ప్రొబేషనరీ ఏఎస్ఎం పదోన్నతుల పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ (Exam question paper leakage) కుంభకోణం కేసు దర్యాప్తు, విచారణలు పూర్తై నింధితులకు ఎట్టకేలకు శిక్ష పడింది. ఈ కేసులో నింధితులలో ఉన్న ఓ ప్రైవేటు వ్యక్తి కేసు ట్రైల్స్ జరుగుతున్న సమయంలో మృతిచెందగా మిగిలిన నాటి 8మంది రైల్వే సిబ్బందిపై నేరారోపణలు రుజువు కావడంతో సిబిఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్షను విధించింది. ఈ కేసుకు సంబంధించిన పూర్వాపరాలు ఇలా వున్నాయి. పశ్చిమ రైల్వే బరోడా డివిజన్లో 2002 ఆగస్టులో జరిగిన పదోన్నతుల పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో 8 మంది రైల్వే సిబ్బందిపై నేరారోపణలు రుజువు కావడంతో ఒక్కొక్కరికి ఐదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరిపై రూ.5లక్షల జరిమానా విధిస్తూ అహ్మదాబాద్ సిబిఐ (Ahmedabad CBI) ప్రత్యేక న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్లు సిబిఐ/రైల్వే వర్గాలు తెలిపాయి.

చార్జిషీట్

పశ్చిమ రైల్వే బరోడా డివిజన్లో 2002 ఆగస్టు 18న నిర్వహించనున్న రైల్వే ప్రొటేషనరీ సహాయ స్టేషన్ మాస్టర్ పదోన్నతి పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ చేసేందుకు రైల్వే సిబ్బంది, పలువురు ప్రైవేటు వ్యక్తులు నుంచి రూ.50వేల నుంచి లక్ష వరకు నింధితులు అక్రమంగా వసూలు చేసినట్లు ఆరోపిస్తూ అహ్మదాబాద్ చీఫ్ విజిలెన్స్ ఇన్స్స్పెక్టర్ (Ahmedabad Chief Vigilance Inspector) చేసిన ఫిర్యాదు మేరకు 2002 ఆగస్టు 17న సిబిఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించి 2003 జూలై 28 న చార్జిషీట్ దాఖలు చేసింది. అహ్మదాబాద్లోని సిబిఐ కేసుల ప్రత్యేక న్యాయస్థానం విచారణలో 8మంది నింధితులు అక్రమార్జనకై నేరపూరిత కుట్ర నేరానికి పాల్పడినట్లు నేరారోపణలు రుజువు అయ్యాయన్నారు.

రైల్వే వ్యవస్థలో నంబర్ 1 దేశం ఏది?

ప్రపంచంలోనే అత్యంత విస్తృతమైన రైల్వే నెట్‌వర్క్ ఉన్న దేశం అమెరికా సంయుక్త రాష్ట్రాలు (United States). ఈ దేశంలో రైల్వే మార్గాల పొడవు సుమారుగా 220,480 కిలోమీటర్లు ఉంది.

భారతదేశంలో మొట్టమొదటి రైలు ఎప్పుడు, ఎక్కడ ప్రారంభించబడింది?

భారత ఉపఖండంలో మొట్టమొదటి రైలు బొంబాయి (ఇప్పటి ముంబై) నుంచి తానే వరకు 21 మైళ్ల దూరం,ఈ రైలు 1853 ఏప్రిల్ 16న ప్రారంభమైంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also: National Sports Bill 2025: లోక్‌సభలో జాతీయ క్రీడా బిల్లు ప్రవేశం..

Ahmedabad CBI judge Baroda Division Breaking News CBI court Exam Paper Leak Jail sentence latest news Probationary ASM promotion exam scam railway scam Western Railway

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.