हिन्दी | Epaper
ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telugu News: Pune: కూతుర్ల మీద ప్రేమ .. కట్ చేస్తే రూ. 14 కోట్లు పోగొట్టుకున్న తండ్రి

Tejaswini Y
Telugu News: Pune: కూతుర్ల మీద ప్రేమ .. కట్ చేస్తే రూ. 14 కోట్లు పోగొట్టుకున్న తండ్రి

Pune: తన కుమార్తెల అనారోగ్యాన్ని నయం చేయాలన్న ఆత్రంలో ఒక ఐటీ ఇంజనీర్ కుటుంబం జీవితకాల సంపాదన మొత్తాన్ని కోల్పోయింది. మహారాష్ట్రలోని పూణేలో చోటుచేసుకున్న ఈ మోసం కేసు టెక్కీ వర్గాల్లో సంచలనం రేపింది. ఆధ్యాత్మిక వైద్యం పేరుతో నమ్మకాన్ని దోచుకున్న నిందితురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీపీ వివేక్ మసల్ తెలిపిన వివరాల ప్రకారం, బాధిత దంపతులు 2018లో ఒక ఆధ్యాత్మిక మహిళను కలిశారు. ఆమె తరచూ “దైవ శక్తుల ద్వారా రోగాలను నయం చేయగలమని” చెప్పి విశ్వాసాన్ని పొందింది.
బాధితుడు లండన్‌లో పని చేసి 2010లో పూణేకు తిరిగి వచ్చిన టెక్కీ. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉండగా, ఒకరు వికలాంగురాలు, మరొకరు తీవ్రమైన ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో, ఆధ్యాత్మిక మహిళ ఇచ్చిన మాటలపై విశ్వాసం ఉంచి ఆమె వద్దకు వెళ్లారు.

Read Also: Chevella: ముగ్గురు కూతుళ్ల జీతమా ఇది?.. బోరున ఏడ్చిన తండ్రి!

“మీ ఇళ్లపై దోషం ఉంది, దానిని తొలగించాలంటే మీ ఆస్తులను అమ్మి ఆ డబ్బును పూజా కార్యక్రమాలకు వినియోగించాలి” అని ఆ మహిళ నమ్మబలికింది. ఆమె ఆధ్వర్యంలో పూజలు, యజ్ఞాలు చేస్తే పిల్లల ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పి వారిని పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకుంది. దాంతో బాధితుడు లండన్‌లోని ఇల్లు, పూణేలోని(Pune) ఫ్లాట్, కొంకణ్‌లో ఉన్న భూమి—అన్నీ అమ్మేశాడు. అంతేకాకుండా ప్రావిడెంట్ ఫండ్, బంధువుల వద్ద తీసుకున్న అప్పులు కూడా ఆమె ఖాతాలకు బదిలీ చేశాడు. 2018 నుంచి 2024 మధ్యకాలంలో మొత్తం రూ.14 కోట్లు ఆ నిందితురాలి ఖాతాలకు చేరాయి. పూజల తర్వాత కూడా పిల్లల ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో దంపతులు ఆ మహిళ మోసం చేశారని గ్రహించారు. తాము సంపాదించిన ప్రతి రూపాయి పోయిందని తెలుసుకుని తీవ్ర నిరాశకు గురయ్యారు.
చివరికి న్యాయ సలహా తీసుకుని నవంబర్ 3, 2025న పూణే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

డీసీపీ వివేక్ మసల్ మాట్లాడుతూ, “ఫిర్యాదులో పేర్కొన్న అన్ని అంశాలను పరిశీలిస్తున్నాం. నిందితురాలి ఖాతాలు, డబ్బు లావాదేవీల మార్గాలు, సహచరుల పాత్రలను ట్రేస్ చేస్తున్నాం. పూర్తి వివరాలు లభించిన తర్వాత తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం” అని తెలిపారు.
పోలీసులు సైబర్ మరియు ఆర్థిక నేరాల చట్టాల కింద కేసు నమోదు చేసే ప్రక్రియలో ఉన్నారు. ఈ ఘటనతో ఐటీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఆధ్యాత్మికత పేరుతో నమ్మకాన్ని దోచుకునే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం బాధిత టెక్కీ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుని, తన కుమార్తెల వైద్య చికిత్స కోసం మళ్లీ పోరాటం కొనసాగిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870