దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన భారీ పేలుడు (Delhi Blast) దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరా తీశారు.
Read Also: Delhi Blast: ఢిల్లీలో భారీ పేలుడు..8 మంది మృతి, పదుల సంఖ్యలో గాయాలు
ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు
అమిత్ షా (Amit Shah) ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి ఢిల్లీ నగర పోలీస్ కమిషనర్తో మాట్లాడారని అధికారులు తెలిపారు. ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్తో మాట్లాడి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారని వెల్లడించారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిస్థితిని సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా మాట్లాడి పేలుడు ఘటనపై ఆరా తీశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: