Peddapalli News: పెద్దపల్లి జిల్లాలో అవినీతి ఘటన మరోసారి వెలుగులోకి వచ్చింది. మంథని పట్టణంలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా చిక్కడం కలకలం రేపింది. మంథని సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్న కాసర్ల రాజేందర్ భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా లంచం డిమాండ్ చేయడం ఈ వ్యవహారానికి కారణమైంది.
Read Also: Allu Arjun Charge Sheet Rejection: సంధ్య థియేటర్ ఛార్జ్షీట్ను తిరస్కరించిన నాంపల్లి కోర్టు
రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పోలీసులు
వివరాల్లోకి వెళ్తే, ఒక వ్యక్తి కొనుగోలు చేసిన భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ రూ. 16,500 లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో వలపన్నారు. రాజేందర్ సూచన మేరకు, బాధితుడు ఆ డబ్బును రషీద్ అనే ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్కు మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇస్తుండగా ఏసీబీ అధికారులు వారిని పట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఏసీబీ అధికారులు ప్రజలకు కీలక సూచన చేశారు. ఏ ప్రభుత్వ అధికారి అయినా లంచం డిమాండ్ చేస్తే, తమ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. వాట్సాప్ (9440446106), ఫేస్బుక్, అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా తమను సంప్రదించవచ్చని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: