Latest News: Pawan Kalyan: HYD పోలీసులకు పవన్‌కల్యాణ్‌ అభినందనలు

Read Time:  1 min
Latest News: Pawan Kalyan: HYD పోలీసులకు పవన్‌కల్యాణ్‌ అభినందనలు
FONT SIZE
GET APP

ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ” డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో పోస్ట్ చేస్తున్న ముఠాల వల్ల చిత్ర పరిశ్రమ తీవ్రంగా నష్టపోతోంది. సినిమా విడుదలే ఒక మహా యజ్ఞంగా మారిపోయిన తరుణంలో పైరసీ ముఠాలను కట్టడి చేయడం దర్శకనిర్మాతలకు సాధ్యం కావడం లేదు.

Read Also: IBOMMA CLOSED: ఐబొమ్మ‘సైట్‌ను పూర్తిగా మూసేశాం.. అదికారిక ప్రకటన

పైరసీలో కీలకంగా ఉన్న ఐబొమ్మ, బప్పమ్ వెబ్ సైట్ల నిర్వాహకుడిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసి, అతనితోనే వాటిని మూయించివేయడం స్వాగతించదగ్గ పరిణామం. పోలీసులకు సవాల్ విసిరే స్థాయికి పైరసీ ముఠాలు వచ్చిన తరుణంలో హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసు బృందం చేసిన ఆపరేషన్ విజయవంతమైంది.

ఈ ఆపరేషన్లో భాగమైన పోలీసులకు, సిటీ కమిషనర్ శ్రీ వి.సి.సజ్జనార్ (V.C. Sajjanar) కి అభినందనలు తెలియచేస్తున్నాను. బెట్టింగ్ మాఫియా, పొంజీ స్కీమ్స్ లాంటివాటిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, వాటి వల్ల ప్రజలు ఏ విధంగా ఆర్థికంగా చితికిపోతున్నారో చైతన్యపరుస్తున్నారు. ఆయనతో ఓ సందర్భంలో సమావేశమైనప్పుడు పొంజీ స్కీమ్స్ మూలంగా ప్రజలు ఆర్థికంగా ఏ విధంగా మోసానికి గురై నష్టపోతున్నారో వివరించారు (Pawan Kalyan).

Pawan Kalyan congratulates HYD police
Pawan Kalyan congratulates HYD police

రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం చేకూర్చాడు

అలాగే బెట్టింగ్ యాప్స్ ను నియంత్రించేందుకు శ్రీ సజ్జనార్ చేపట్టిన కార్యక్రమం అన్ని రాష్ట్రాల్లోనూ కదలిక తీసుకువచ్చింది. ఆయన నేతృత్వంలో చేపట్టే చర్యలు కచ్చితంగా తెలుగు సినిమాకే కాదు యావత్ భారతీయ చిత్ర పరిశ్రమకు మేలు చేస్తాయి” అని పవన్ తెలిపారు.పైరసీ వల్ల సినిమా పరిశ్రమకు నష్టం చేస్తున్న ఐబొమ్మ (Ibomma) నిర్వాహకుడు ఇమ్మడి రవిని (Immadi Ravi) అరెస్టు చేసినట్లు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ సజ్జనర్‌ సోమవారం వెల్లడించారు.

ఇమ్మడి రవి పై ఐటీ యాక్ట్‌, కాపీ రైట్‌ యాక్ట్‌ కింద మరో 4 కేసులు నమోదు చేసినట్లు మీడియా సమావేశంలో చెప్పారు. పైరసీ వెబ్‌సైట్‌ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో సినీపెద్దలు చిరంజీవి, నాగార్జున, దిల్‌రాజు, సురేశ్‌ బాబుతో పాటు దర్శకుడు రాజమౌళి సీపీ సజ్జనార్‌తో భేటీ అయ్యారు.

అనంతరం సజ్జనార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘పైరసీకి సంబంధించి అంతకు ముందు ప్రశాంత్‌, శివరాజ్‌ను కూడా అరెస్టు చేశాం. ఇమ్మడి రవి సమాజానికి రెండు రకాలుగా నష్టం చేకూర్చాడు. పైరసీ ద్వారా చిత్రపరిశ్రమకు కోట్ల నష్టం చేయడమే కాకుండా బెట్టింగ్‌ యాప్‌లను ప్రమోట్‌ చేశాడని తెలిపారు.  దీంతో చాలా మంది డబ్బు, ప్రాణాలు కోల్పోయారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.