Delhi suicide case : న్యూఢిల్లీ ప్రముఖ పాన్ మసాలా వ్యాపారి కుటుంబానికి చెందిన కోడలు దిల్లీలో ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. దక్షిణ–పశ్చిమ దిల్లీలోని వసంత్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్న 38 ఏళ్ల మహిళ, తన ఇంటిలోనే ఉరేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, ఆమె భర్త ఉదయం జిమ్కు వెళ్లి ఇతర పనులు (Delhi suicide case) ముగించుకొని ఇంటికి తిరిగివచ్చిన సమయంలో బెడ్రూమ్లోని డ్రెసింగ్ రూమ్లో ఆమె ఉరేసుకుని కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు, గృహ సహాయకులు ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
Read Also: Ration Card : ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం తీపికబురు
గది నుంచి ఒక డైరీను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో వ్యక్తిగత సంబంధ సమస్యల గురించి కొన్ని గమనికలు ఉన్నాయని, అయితే ఎవరినీ నేరుగా బాధ్యులుగా పేర్కొనలేదని అధికారులు తెలిపారు. మహిళ భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి వసంత్ విహార్లో నివసిస్తుండగా, సంఘటన సమయంలో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నట్లు పోలీసులు చెప్పారు.
దక్షిణ–పశ్చిమ డీసీపీ అమిత్ గోయల్ వెల్లడించిన మేరకు, మృతదేహాన్ని సఫ్దర్జంగ్ ఆస్పత్రి మార్చురీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ కేసులో అనుమానాస్పద మరణంగా నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.
అయితే, మృతురాలి సోదరుడు మాట్లాడుతూ, తన సోదరిని భర్త, అత్తమామలు వేధించారని ఆరోపించారు. భర్త మరో మహిళతో సంబంధం పెట్టుకున్నాడని, ఈ కారణంగానే ఇంట్లో వేధింపులు ఎదురయ్యాయని పేర్కొన్నారు. మరోవైపు, వ్యాపారి కుటుంబ న్యాయవాది ఈ ఆరోపణలను ఖండిస్తూ, ఎలాంటి సుయిసైడ్ నోట్ లేదా ఫిర్యాదు లేదని స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: