📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది బస్సు ప్రమాదం .. 26 మందికి గాయాలు? భూముల మార్కెట్ విలువ పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్ – 2026’ ప్లాట్ల క్రమబద్ధీకరణకు ఈ నెల 23 చివరి గడువు నేతన్నలకు త్రిఫ్ట్ నిధులు విడుదల నిరుద్యోగ యువతకు అవకాశం: ఉచిత శిక్షణతో ఉద్యోగ భరోసా బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్

Palnadu crime: దారుణం.. రోకలి బండతో కొట్టి చంపిన భర్త

Author Icon By Tejaswini Y
Updated: December 31, 2025 • 5:59 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Husband Kills Wife: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు(Palnadu crime) జిల్లా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామంలో కుటుంబ కలహం ప్రాణాంతకంగా మారింది. భార్యపై అనవసర అనుమానాలు పెంచుకున్న భర్త ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. మృతురాలు పుష్ప కాగా, నిందితుడు ఆమె భర్త సాల్మన్ రాజుగా పోలీసులు గుర్తించారు.

Read Also: Obulavaripalle Accident: మహిళ ప్రాణాలు తీసిన పొగ మంచు

Palnadu crime: Cruelty.. Husband beats wife to death with a green stone

దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు

వివాహమైనప్పటి నుంచే పుష్పపై సాల్మన్ రాజు అనుమానం వ్యక్తం చేస్తూ తరచూ గొడవలకు దిగేవాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదే కారణంగా దంపతుల మధ్య తరచూ వాగ్వాదాలు జరుగుతుండేవని సమాచారం. ఈ క్రమంలో మంగళవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, తీవ్ర ఆగ్రహానికి లోనైన సాల్మన్ రాజు ఇంట్లో ఉన్న పచ్చడి బండతో పుష్పపై దాడి చేశాడు.

తీవ్ర గాయాల పాలైన పుష్ప అక్కడికక్కడే రక్తస్రావంతో మృతి(Died) చెందింది. ఘటనను గమనించిన పొరుగువారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం(Postmortem) కోసం తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ సంఘటనతో గ్రామంలో భయభ్రాంతులు నెలకొన్నాయి. అనుమానం పేరుతో జరుగుతున్న కుటుంబ హింస సంఘటనలు పెరుగుతుండటంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AP crime news Chilakaluripet Husband kills wife Palnadu district Veluru Village wife murder

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.