OnlineScam: కొత్త తరహా సైబర్ మోసాలు: రూ.5 నోటు పేరిట మాయ

Read Time:  1 min
OnlineScam
OnlineScam
FONT SIZE
GET APP

సైబర్ కేటుగాళ్లు రోజురోజుకూ కొత్త పద్ధతులతో ప్రజలను మోసం చేస్తున్నారు. తాజాగా, రూ.5 నోటు చాలా అరుదైనదని, అది తమకు ఉంటే రూ.10 లక్షలు ఇస్తామని అంటూ ఫోన్ కాల్స్ (OnlineScam) చేసి బాధితులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నోటును కొనుగోలు చేసే ప్రక్రియ కోసం ముందుగా కొంత మొత్తం పంపాలని మోసగాళ్లు సూచిస్తున్నారు. ఈ మాటలు నమ్మి డబ్బు పంపగానే, వారు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అందుబాటులో ఉండకుండా మారిపోతున్నారు.

Read Also: Gujarat crime: కన్న కూతురిపై 45 ఏళ్ల తండ్రి అత్యాచారం..

OnlineScam
OnlineScam

APK ఫైళ్లపై హెచ్చరిక

ఇలాంటి మోసాలతో పాటు, తెలియని నంబర్ల నుంచి APK ఫైళ్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని మెసేజులు కూడా వస్తున్నాయని పోలీసులు తెలిపారు. అటువంటి ఫైళ్లను ఓపెన్ చేస్తే, మొబైల్ డేటా, బ్యాంక్ వివరాలు ప్రమాదంలో(OnlineScam) పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తులు లేదా అనుమానాస్పద ఆఫర్లకు స్పందించవద్దని, ముందుగా డబ్బులు అడిగే లావాదేవీలకు దూరంగా ఉండాలని పోలీసులు సూచించారు. ఏదైనా సందేహాస్పద కాల్స్ లేదా మెసేజులు వస్తే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Pooja

రచయిత గురించి

Pooja

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.