📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Nellore Crime: అనుమానంతో భార్యను క్రూరంగా చంపిన భర్త

Author Icon By Tejaswini Y
Updated: January 31, 2026 • 5:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Nellore Crime: నమ్మకంతో వచ్చిన భార్యను అనుమానంతో కబళించాడో కిరాతక భర్త. పచ్చని సంసారంలో అనుమానం పెనుభూతంగా మారి, ఇద్దరు చిన్నారులను అనాథలను చేసిన ఘటన నెల్లూరు నగరంలో కలకలం రేపింది.

Read Also: AP: పల్నాడు జిల్లా మాచర్లలో పిచ్చికుక్క బీభత్సం

Nellore Crime

అనుమానం పెంచిన దూరం

పోలీసుల సమాచారం ప్రకారం.. నందిని, శ్రీహరిలకు నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు సంతానం. అయితే, గత కొంతకాలంగా భార్య నందిని ప్రవర్తనపై శ్రీహరి అనుమానం పెంచుకున్నాడు. ఈ మనస్పర్థల కారణంగా దంపతులిద్దరూ గత తొమ్మిది నెలలుగా విడివిడిగా ఉంటున్నారు. నందిని తన జీవనోపాధి కోసం బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది.

ప్రేమగా పిలిచి.. ప్రాణం తీసి..

శనివారం ఉదయం బెంగళూరు నుంచి నెల్లూరు చేరుకున్న నందినిని తీసుకెళ్లడానికి శ్రీహరి రైల్వే స్టేషన్‌కు వెళ్లాడు. అంతా సవ్యంగానే ఉందనుకుని ఆమె భర్తతో కలిసి బయలుదేరింది. అయితే, నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపానికి చేరుకోగానే శ్రీహరి తన(Husband kills wife) అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. వెంట తెచ్చుకున్న కత్తితో ఒక్కసారిగా నందిని గొంతు కోశాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. నడిరోడ్డుపై జరిగిన ఈ ఘోరాన్ని చూసి స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అనుమానమే ఈ హత్యకు ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Andhra Pradesh Crime Updates Husband kills wife in Nellore Nellore Children's Park Murder Nellore Crime News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.