- రూ.19.17 లక్షల విలువైన స్టాక్ సీజ్
నెల్లూరు క్రైమ్ : ఎటువంటి విజిలెన్స్ అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో మెరుపు దాడులు నిర్వహించి భారీ ఎత్తున అక్రమ గుట్కా, పాన్ మసాలా నిల్వలను పట్టుకున్నారు. అనుమతులు లేదా బిల్లులు లేకుండా విక్రయించడానికి సిద్ధంగా ఉంచిన సుమారు రూ. 19,17,787 విలువైన ఉత్పత్తులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరు నగరంలోని పప్పుల వీధిలో గల భగవాన్ వెంకయ్య స్వామి ట్రాన్స్పోర్ట్, స్టోన్ హౌస్ పేటలోని రాజ్యలక్ష్మి ట్రాన్స్ పోర్ట్లలో నిర్వహించిన సోదాల్లో వరుసగా రూ. 2.55 లక్షలు, రూ.2.75 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను గుర్తించారు.
Read also: UP Crime: ఇంట్లో ఐదు మృతదేహాలు.. గోడపై ఏం రాసుందంటే?
Huge amount of illegal gutka, paan masala seized
అదే విధంగా కావలిలోని శ్రీ వెంకటేశ్వర ఏజెన్సీస్ కు చెందిన ముసునూరు వడ్డిపాలెం వద్ద ఉన్న వారి గోదాముపై అధికారులు దాడి చేశారు. ఈ తనిఖీల్లో సరైన రికార్డులు లేని 9,392 పాన్ మసాలా సాచెట్లతో పాటు ఇతర వస్తువులను సీజ్ చేశారు. వీటి విలువ రూ. 13.87 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. చట్ట విరుద్ధంగా ఇటువంటి నిషేధిత ఉత్పత్తులను విక్రయించినా లేదా నిల్వ ఉంచినా కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సిఐ నరసింహారావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: