Nazdik Singaram Village: విద్యుత్ ఘాతానికి ఓ రైతు మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని నజ్ధిక్ సింగారం గ్రామంలో శుక్రవారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నజ్దిక్ సింగారం గ్రామానికి చెందిన పుణ్యమూర్తి అంజయ్య (50) విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. గురువారం కురిసిన భారీ వర్షానికి విద్యుత్ స్తంభాలు తీగలు తెగిపడి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అంజయ్య శుక్రవారం ఉదయం బోరుబావి మోటర్ ను నడిపిద్దామని విద్యుత్ స్టార్టర్ డబ్బా వద్దకు వెల్లగా విద్యుత్ ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందారు. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవిస్తున్న అంజయ్య కు భార్య చంద్రమ్మ ఐదు మంది కూతుర్లు, అందులో నలుగురు పెళ్లి కాగా ఐదో కూతురు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.అకాల మరణంతో గ్రామస్తులు బంధుమిత్రులు బాధ తో శోక సంద్రంలో మునిగిపోయారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అంజయ్య కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు ప్రజాప్రతినిధులు కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: