Nandyal: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

Read Time:  1 min
Nandyal: ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య
FONT SIZE
GET APP

ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల పట్టణంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. లలితానగర్‌కు చెందిన మల్లిక (27) అనే మహిళ, తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మల్లికకు కుమారుడు ఇషాంత్ సాయి (5 సంవత్సరాలు), కుమార్తె పరిణిత (7 నెలలు) గత రెండేళ్లుగా భర్త ఉదయ్‌కిరణ్‌తో పాటు తోటికోడలు ప్రసన్న, ఆడపడుచు నుంచి మల్లిక తీవ్ర వేధింపులకు గురవుతుండేదని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

Read also: Nellore Crime: ఇసుకపల్లి బీచ్ లో విషాదం

ఇంట్లోనే ప్రాణాంతక ఘటన

శుక్రవారం రోజు మల్లికపై భర్త దాడి చేసినట్లు సమాచారం. ఆ తరువాత శనివారం ఉదయం ఆమె గది తలుపులు తెరవకపోవడంతో అనుమానం కలిగింది. మల్లిక అన్న కార్తీక్ ఇంటికి వచ్చి తలుపులు తెరవగా, లోపల మల్లిక ఉరివేసుకుని కనిపించగా, ఇద్దరు చిన్నారులు అపస్మారక స్థితిలో మృతి చెంది ఉన్నారు. ఈ దృశ్యం చూసిన కుటుంబసభ్యులు తీవ్ర షాక్‌కు గురయ్యారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ వేధింపులే ఈ విషాదానికి కారణమని భావిస్తున్న పోలీసులు, కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటన మరోసారి కుటుంబ వేధింపులు ఎంతటి ప్రమాదకర పరిస్థితులకు దారితీయవచ్చో చూపిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.