భోజనానికి ఇంటికి వస్తున్నానని తల్లికి ఫోన్ చేసి చెప్పిన ఒక యువ వైద్యుడు(Doctor) కొద్దిసేపటికే వంతెనపై నుంచి నీటిలోకి దూకిన ఘటన ముంబై(Mumbai)లో తీవ్ర కలకలం రేపింది. ఆసుపత్రి నుంచి ఇంటికి బయలుదేరిన ఆయన మార్గమధ్యలో ఈ తీవ్ర నిర్ణయం తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ముంబైలోని ప్రఖ్యాత జేజే హాస్పిటల్(JJ Hospital) పనిచేస్తున్న డాక్టర్ ఓంకార్ (32) జూలై 7వ తేదీ రాత్రి విధులను ముగించుకుని కారులో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో తన తల్లికి ఫోన్ చేసి భోజనానికి వస్తున్నట్లు తెలిపారు. అయితే, రాత్రి సుమారు 9:40 గంటల సమయంలో ముంబైని నవీ ముంబైతో కలిపే అటల్ సేతు వంతెనపై తన కారును ఆపారు. ఆ తర్వాత ఒక్కసారిగా వంతెన పైనుంచి నీటిలోకి దూకేశారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు
గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, వంతెనపై ఆపి ఉన్న కారును, అందులోని ఐఫోన్ను గుర్తించారు. కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి డాక్టర్ ఓంకార్గా నిర్ధారించారు. ప్రస్తుతం కోస్ట్ గార్డ్ సిబ్బంది, పోలీసులు సంయుక్తంగా డాక్టర్ ఓంకార్ ఆచూకీ కోసం రెండు రోజులుగా గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇంటికి భోజనానికి వస్తున్నానని చెప్పిన ఆయన, ఇంతటి తీవ్ర నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్నది మిస్టరీగా మారింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: Sports : కోహ్లీతో నాకు పరిచయం ఉంది : నోవాక్ జొకోవిచ్