ములుగు(Mulugu) జిల్లాలో సైబర్ నేరగాళ్ల వేధింపులు ఓ వ్యక్తి ప్రాణాలు తీసిన విషాద ఘటన చోటుచేసుకుంది. వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన కోరం రామారావు తీవ్ర మానసిక ఒత్తిడితో బలవన్మరణానికి పాల్పడటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Also: Delhi: బాంబు బెదిరింపులు.. విద్యార్థులను ఇంటికి పంపించిన అధికారులు

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గుర్తు తెలియని వ్యక్తులు రామారావు ఫోన్ను హ్యాక్ చేసి ఆయన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించారు. గత మూడు రోజులుగా తరచూ కాల్స్ చేసి బెదిరింపులకు గురిచేస్తూ మానసికంగా వేధించారని తెలుస్తోంది. ఈ వేధింపులు భరించలేక రామారావు గడ్డి మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.
కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారు. చనిపోయే ముందు రాసిన సూసైడ్ నోట్లో తన మరణానికి కారణమైన సైబర్ నేరగాళ్లపై(Mulugu) కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ ఘటనతో తిప్పాపురం గ్రామంలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. సైబర్ నేరాలను కఠినంగా నియంత్రించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: