MP Sudha Ramakrishnan: ఎంపీ సుధా రామకృష్ణన్‌ చైన్ లాక్కెళ్లిన దుండగుడు

Read Time:  1 min
MP Sudha Ramakrishnan:
MP Sudha Ramakrishnan:
FONT SIZE
GET APP

దేశ రాజధాని ఢిల్లీ మరోసారి మహిళల భద్రతా లోపాలను బహిర్గతం చేస్తూ సంచలనాత్మక సంఘటనకు వేదికైంది. ఈసారి బాధితురాలు సామాన్య మహిళ కాదు, ఏకంగా కాంగ్రెస్ ఎంపీ సుధా రామకృష్ణన్ (MP Sudha Ramakrishnan) కావడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.ఢిల్లీ చాణక్యపురి ప్రాంతం దేశంలో అత్యంత సురక్షితమైన హై-సెక్యూరిటీ జోన్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలో అనేక రాయబార కార్యాలయాలు, విదేశీ అతిథుల నివాసాలు ఉండటంతో ఎల్లప్పుడూ కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయితే ఇంత కఠిన భద్రతా వలయంలోనూ మహిళలపై నేరాలు ఆగకపోవడం చింతాజనకమని నిపుణులు అంటున్నారు.సుధా రామకృష్ణన్ ప్రతిరోజూ చేసే అలవాటులో భాగంగా ఉదయం వాకింగ్‌కు వెళ్లారు. ఆమె నడుస్తున్న సమయంలో గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బైక్‌పై వచ్చి, ఒక్కసారిగా ఆమె మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. దుండగులు ఈ దాడి అంత వేగంగా చేసి అక్కడి భద్రతా సిబ్బందిని, సీసీ కెమెరాలను కూడా మోసగించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గొలుసును లాక్కొని పారిపోయయినట్లు తెలిపారు

ఈ సంఘటన కేవలం ఒక చైన్ స్నాచింగ్ (Chain snatching) కాదు, దేశ రాజధాని భద్రతా లోపాలను, చట్టరాజ్యం పట్ల నేరస్తుల నిర్భయ ధోరణిని బహిర్గతం చేస్తోందని పలువురు విశ్లేషకులు పేర్కొంటున్నారు.సోమవారం ఉదయం సుమారు 6.15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు ఎంపీ పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె తన సహచర ఎంపీ రాజాతి (డీఎంకే)తో కలిసి ఉదయం వాకింగ్ చేస్తుండగా, హెల్మెట్ ధరించిన ఒక వ్యక్తి స్కూటర్‌పై వేగంగా వచ్చి ఆమె మెడలో ఉన్న గొలుసును లాక్కొని పారిపోయయినట్లు తెలిపారు. ఈ క్రమంలో తాను కింద పడిపోయి, మెడకు గాయాలు అయినట్లు వెల్లడించారు. అలాగే దుండగుడు చైన్‌ లాగుతున్న క్రమంలో బట్టలు కూడా లాగగా, అవి చిరిగిపోయినట్లు వివరించారు. పోగొట్టుకున్న గొలుసు నాలుగు తులాల కంటే ఎక్కువ బరువుగానే ఉంటుందని, ఘటన తర్వాత సాయం కోసం తాను, ఎంపీ రాజాతి గట్టిగా ఏడుస్తూ కేకలు వేసినట్లు స్పష్టం చేశారు.

MP Sudha Ramakrishnan:

చట్టసభ సభ్యులకు

ఈ ఘటన తర్వాత తీవ్ర భయాందోళనకు గురైన సుధా రామకృష్ణన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఒక లేఖ రాశారు. దేశ రాజధానిలో ఉన్న ఒక రక్షిత ప్రాంతంలో, అది కూడా ఒక పార్లమెంటు సభ్యురాలిగా తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సాధారణ మహిళల పరిస్థితి ఏమిటని ఆమె ఆ లేఖలో ప్రశ్నించారు. చట్టసభ సభ్యులకు కూడా భద్రత లేకపోతే, ప్రజలు ఎక్కడ సురక్షితంగా ఉండగలరని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ లేఖ హోంమంత్రి కార్యాలయానికి చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో శాంతిభద్రతల పరిస్థితిపై ఈ ఘటన తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగను పట్టుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

చైన్ స్నాచింగ్ ఎక్కువగా ఎక్కడ జరుగుతుంది?

బహిరంగ ప్రదేశాలు, రహదారులు, బస్ స్టాప్‌లు, వాకింగ్ జోన్‌లు, రద్దీ ప్రాంతాలు వంటి చోట్ల ఎక్కువగా జరుగుతుంది. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా నడుస్తున్నప్పుడు లక్ష్యంగా చేసుకుంటారు.

చైన్ స్నాచింగ్‌కు ఎలాంటి శిక్షలు ఉంటాయి?

ఇది దొంగతనం, దోపిడీ నేరంగా పరిగణించబడుతుంది. దీనికి జైలుశిక్షతో పాటు జరిమానా కూడా విధించబడుతుంది. ఆయుధాలతో దాడి జరిగితే శిక్ష మరింత పెరుగుతుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/dharmasthala-temple-key-evidence-in-the-excavations-of-dharmasthala/national/525812/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.