📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Telangana crime : ఇద్దరు పిల్లల్ని చంపి.. తల్లి ఆత్మహత్య

Author Icon By Sai Kiran
Updated: September 6, 2025 • 3:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Telangana crime: జీవితం విలువైనది. అందమైనది కూడా. అలాగని అన్నీ సుఖాలు, ఆనందాలే ఉంటాయని అనుకోకూడదు. రాత్రీపగలు, చీకటి వెలుగు ఉన్నట్లుగానే కష్టాలతోనే సుఖాలు కూడా ఉంటాయని గ్రహించాలి. మనం ప్రేమించేవారు మనల్ని మోసం చేయవచ్చు. లేదా ఇతరుల కారణంగా మనం నష్టం కలగవచ్చు. అంతమాత్రాన ప్రాణాలు తీసుకోకూడదు. (Telangana crime)మొన్న ఆంధ్రప్రదేశ్లో కుటుంబ కల హాలతో ఓ తండ్రి తన ముగ్గురు బిడ్డల్ని పెట్రోలు పోసి చంపి, అనంతరం అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇలాంటి సంఘటనే తెలంగాణలో చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను కడతేర్చింది.

గొడవలతో విసిగివేసారి..

సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సంగమేశ్ తో ఓ మహిళకు నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. అప్పటటి నుంచి ఈ జంట ఎంతో అన్యోన్నంగా .. హ్యాపీగా గడిపింది. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ హాయిగా జీవించారు. అయితే ఇటీవల ఈ కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. గొడవలకు కారణాలు తెలియకపోయినా తరచూ గొడవలు జరుగుతుండేవి. ఇవి తారాస్థాయికి చేరుకునేసరికి భర్త సంగమేశ్ తన భార్యా పిల్లల్ని పుట్టింట్లో వదిలిపెట్టి వెళ్లిపోయాడు.


దీంతో భార్య ఆవేదనకు గురై తన ఇద్దరు పిల్లల గొంతు నులిమి చంపి, అనంతరం ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. మరణించిన వారిలో రెండు నెలల పసికందు కూడా ఉండడం అత్యంత విషాదకరం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, దర్యాప్తు చేస్తున్నారు. ఏదో కుటుంబ కలహాలతో తన భార్యను, పిల్లల్ని పుట్టింట్లో వదిలేసి వచ్చిన భర్త, తన భార్య ఇంతటి కఠినమైన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయాడు. రెండునెలల పసికందు అనే జాలి కూడా లేకుండా ఇద్దరు పిల్లల్ని చంపి, భార్య ఆత్మహత్యకు పాల్పడడంతో భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. పిల్లల్ని చంపి, ఆత్మహత్య చేసుకునేంత గొడవలు ఏం ఉన్నాయని ఇరువురి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. తమకు చెప్పుకుంటే ఇంత దారుణం జరగకుండా చూసేవారమని రోదిస్తున్నారు.

Read also :

https://vaartha.com/telugu-news-red-fort-the-red-fort-was-targeted-diamond-urn-stolen/crime/542301/

Breaking News in Telugu family disputes suicide case family quarrel leads to death Google News in Telugu Latest News in Telugu mother commits suicide with children mother kills newborn baby mother kills two children suicide Sangareddy suicide case Telangana crime Telangana Crime News Telangana mother kills kids Telugu News tragic incident Sangareddy woman kills kids and herself

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.