Mohanbabu University student suicide: తిరుపతిలోని మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ విద్యార్థిని భువన బలవన్మరణం చెందడం కలకలం రేపింది. ఒక వైపు ఉజ్వల భవిష్యత్తు కళ్లముందు కనిపిస్తున్న తరుణంలో ఆమె ఈ కఠిన నిర్ణయం తీసుకోవడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.
Read also: Koti Firing Case: కోఠి కాల్పుల కేసును చేధించిన పోలీసులు
ఉద్యోగం వచ్చిన ఆనందంలోనే విషాదం
భువన ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్మెంట్లో అద్భుత ప్రతిభ కనబరిచి ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ ఇన్ఫోసిస్ (Infosys) లో ఉద్యోగం సంపాదించింది. వార్షికంగా రూ. 17 లక్షల భారీ ప్యాకేజీతో ఆమె ఎంపికైంది. కెరీర్ పరంగా ఎంతో ఉన్నత స్థితిలో ఉన్న సమయంలో ఆమె ప్రైవేట్ హాస్టల్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకోవడం ఎవరికీ అంతుచిక్కడం లేదు.
తల్లిదండ్రుల ఆవేదన
భువన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రూయా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అక్కడ ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్న తీరు చూసేవారిని కలిచివేస్తోంది. “నిన్న రాత్రి కూడా ఫోన్ చేసి మాట్లాడింది.. త్వరలోనే మన సమస్యలన్నీ తీరిపోతాయని ధైర్యం చెప్పింది” అంటూ వారు గుర్తుచేసుకుంటున్నారు. ఇంతలోనే ఆమె విగతజీవిగా మారడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు.
దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
ప్రైవేట్ హాస్టల్లో జరిగిన ఈ ఆత్మహత్యపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అంత పెద్ద ప్యాకేజీతో ఉద్యోగం వచ్చినప్పటికీ, ఆమె ఆత్మహత్యకు గల కారణాలు ఏమై ఉంటాయనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమె గదిని సోదా చేసి, ఏవైనా సూసైడ్ నోట్ లేదా ఇతర ఆధారాలు ఉన్నాయా అని తనిఖీ చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: