News Telugu: Mental Health: నైట్ షిఫ్ట్ ఒత్తిడితో 10 మందిని చంపేసిన నర్సు!

Read Time:  1 min
Mental Health
Mental Health
FONT SIZE
GET APP

Mental Health: జర్మనీలో ఒక భయంకర సంఘటన వెలుగులోకి వచ్చింది. రాత్రి షిఫ్టుల్లో నిరంతరం పని చేయాల్సి రావడంతో తీవ్ర ఒత్తిడికి గురైన ఓ మేల్‌ నర్స్‌ (Nurse) పది మందిని హత్య చేశాడు. 2007లో నర్సింగ్‌ శిక్షణ పూర్తి చేసుకున్న అతను, 2020లో వుర్సెలెన్ పట్టణంలోని ఒక ఆసుపత్రిలో పనిచేయడం ప్రారంభించాడు. పని ఒత్తిడిని తట్టుకోలేకపోయిన ఆ నర్స్‌ తన పర్యవేక్షణలో ఉన్న వృద్ధ రోగులకు మార్ఫిన్‌, మిడాజోలం వంటి మత్తు మందులను అధిక మోతాదులో ఇంజెక్ట్‌ చేశాడు. దీని ఫలితంగా 10 మంది రోగులు మృతి చెందగా, మరో 27 మందిని చంపడానికి కూడా ప్రయత్నించినట్టు దర్యాప్తులో తేలింది. ఈ ఘటన 2023 డిసెంబర్‌ నుంచి 2024 మే మధ్య చోటుచేసుకుంది. కోర్టు విచారణలో నేరం రుజువై, అతనికి జీవిత ఖైదు విధించారు.

Read also: Betting App: రైనా, శిఖర్ ధావన్‌ ఆస్తులు అటాచ్‌ చేసిన ఈడీ

Mental Health

Mental Health: నైట్ షిఫ్ట్ ఒత్తిడితో 10 మందిని చంపేసిన నర్సు!

వ్యక్తులలో ఆందోళన

Mental Health: ఇక నిపుణుల ప్రకారం, రాత్రి షిఫ్టులు మరియు అధిక పనిభారం వ్యక్తులలో ఆందోళన, ఒత్తిడి, మానసిక రుగ్మతలకు దారితీస్తాయని హెచ్చరిస్తున్నారు. తగిన విశ్రాంతి లేకపోవడం వల్ల కొంతమంది తమ మనసుపై నియంత్రణ కోల్పోయి తప్పు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవారు మానసిక సహాయం లేదా వైద్య సలహా తీసుకోవడం అత్యవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.